సుప్రసిద్ధ నాట్యకారిణి అయినటువంటి మంజుభార్గవి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండేవి. అసలు ఆమె ఏ రోజు కూడా సినిమాల్లో హీరోయిన్ గా చేయాలని ప్రయత్నాలు కూడా చేయలేదు. అయినప్పటికీ ఈమెకు ఎప్పుడు కలలో కూడా ఊహించనటువంటి అద్భుతమైన అవకాశం వచ్చింది. అదే ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన “శంకరాభరణం” సినిమాలో హీరోయిన్ గా తులసి పాత్రలో అద్భుతంగా నటించారు.

ఈ సినిమాలో తులసి పాత్రలో నటించిన మంజుభార్గవికి ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పవచ్చు.అయితే అప్పటి వరకూ చిన్న చిన్న పాత్రలో నటిస్తున్న మంజుభార్గవిని ఇంత పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడం వెనుక ఓ పెద్ద కథే ఉంది. చెన్నైలో ఒకసారి
ప్రొడ్యూసర్స్ గిల్డ్ వారు ఏదో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులంతా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులకు పన్నీరు చల్లటానికి గీత, మంజు భార్గవి, మరో నటిని ముగ్గురిని తలుపు దగ్గర నిలబడి వచ్చే అతిథులపై పన్నీరు చల్లుతున్నారు. ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథులలో కె.విశ్వనాథ్ గారు ఉన్నారు.అయితే అప్పటికే శంకరాభరణం పనులు మొదలు పెట్టిన విశ్వనాథ్ గారు మంజు భార్గవిని చూడగానే తన సినిమాకి హీరోయిన్ దొరికిందని భావించారు. అయితే ఆమె నటన ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం శంకరాభరణం కంటే ముందుగా తీసిన చిత్రం “ప్రెసిడెంట్ పేరమ్మ” చిత్రంలో ఓ పాత్ర ఇచ్చారు.

ఈ సినిమాలో స్టేజ్ పై మేకప్ వేసుకుని నటించడమే కాకుండా ఈ సినిమాకు మంచి భార్గవి చేత డబ్బింగ్ చెప్పించారు.ఈ క్రమంలోనే ఫోటో ఒకటి కావాలని విశ్వనాథ్ గారు చెప్పగా ఆమె ఫోటో ఇచ్చి ఆసంగతి గురించి మర్చిపోయారు. ఒక నెల తరువాత శంకరాభరణం చిత్రం యూనిట్ నుంచి ఎవరో వచ్చి ఫోటో కావాలని అడగగా ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు తీసి పంపించగా ఆ తర్వాత జె.వి సోమయాజులు, మంజుభార్గవికి మేకప్ వేసి ఫోటోలు తీశారు.

ఈ విధంగా తీసిన ఫోటోలను ఇండస్ట్రీలో పలువురి కె విశ్వనాథ్ గారు చూపించారు. అసలు ఆమె మంజు భార్గవి అని ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ విధంగా మంజుభార్గవికి శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం రావడం ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో మంచి భార్గవి ఎంతో పాపులర్ అయ్యారు. అయితే ఆమెకు డాన్స్ పై ఉన్న మక్కువతో సినిమాలలో కంటే డాన్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టడం చేత సినిమాలలో తక్కువగా నటించారు.



























