Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ విషయం గురించి పూర్తిగా ఆలోచించి ఆ మాటలను గొంతులో నుంచి కాకుండా గుండెల్లో నుంచి వస్తుందని అందరికీ తెలిసిందే. ఇలా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి డైరెక్టర్లకు కాస్త చురకలాంటించారు. ఈ సందర్భంగా ఈయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో హీరోయిన్లను దర్శక నిర్మాతలను ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రేక్షకులు ఎప్పుడు కూడా కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తారు కంటెంట్ లేని సినిమాలను నిర్మొహమాటంగా తిరస్కరిస్తారని వెల్లడించారు.
ఇలా తాను నటించిన ఆచార్య సినిమా కూడా ఇదే కోవకి వస్తుందని ఈయన వెల్లడించారు. నేను కూడా బాధితుడేనని ఈ సందర్భంగా ఈయన ఆచార్య డిజాస్టర్ గురించి ప్రస్తావించారు. తాజాగా ఇండస్ట్రీలో విడుదలయ్యి హిట్ అందుకున్న బింబిసారా, సీతారామం, కార్తికేయ 2 సినిమాల విజయం గురించి ప్రస్తావించారు. ఇక డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ దర్శకులు ఎప్పుడు కూడా సినిమా కంటెంట్ పై ఫోకస్ పెట్టాలి కానీ కాంబినేషన్ల మీద, సినిమా రిలీజ్ మీద కాదని సినిమాలో కంటెంట్ లేకపోతే కాంబినేషన్ ఉండి ఏ లాభం అంటూ ఈయన తెలిపారు.
చిత్ర పరిశ్రమ బాగుపడాలంటే అంతా డైరెక్టర్ చేతిలోనే ఉందని ఈ సందర్భంగా చిరంజీవి డైరెక్టర్లకు తనదైన స్టైల్ లో క్లాస్ పీకారు.ఇలా చిరంజీవి డైరెక్టర్లను ఉద్దేశించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈయన కొరటాల శివని ఉద్దేశించి చేశారని పలువురు భావిస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతోనే మెగాస్టార్ ఈ విషయాలను ప్రస్తావించారని తెలుస్తోంది.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…