నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్నను పోలీసులు క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లి అరెస్ట్ చేశారు. గడిచిన కొన్ని రోజులుగా క్యూ న్యూస్ మాజీ విలేకరి చిలుక ప్రవీణ్, తీన్మార్ మల్లన్న మధ్య వివాదం నడుస్తున్న విషయం అందరికి తెలిపిందే.

అయితే ప్రవిణ్ కౌంటర్గా మల్లన్న ప్రత్యారోపణలు చేశారు. అందులో భాగంగా కొన్ని ఫొటోలు, వీడియోలను బయటపెట్టారు. అందులో ప్రియాంక అనే యువతి ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో ఆమె మంగళవారం సిటీ సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు.



























