అంతర్జాతీయ కార్ల అమ్మకాలలో హ్యుండాయ్ కి మంచి పేరు ఉంది. కాలానికి అనుగణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రక రకాలా కార్లు లాంచ్ చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో దూసుకుపోతుంది. అయితే తాజాగా హ్యుండాయ్ తన కార్ల కంపెనీ మూసివేసింది. అది కూడా కరోనా ఎఫెక్ట్ తో.. కంగారు పడకండి ఇండియాలో కాదు…ఇది జరిగింది దక్షిణ కొరియాలో..

దక్షిణ కొరియాలో ఉల్సాన్ లోని హ్యుండాయ్ కార్ల ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్టు అధికారిగా ప్రకటిచింది. హ్యుండాయ్ కంపెనీ ఉద్యోగి ఒకరు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారు. తాజగా అతనికి నిర్వహించిన టెస్టులలో అతనికి కరోనా వైరస్ ఉందని తేలింది. దేనితో అప్రమత్తమైన హ్యుండాయ్ వెంటనే తన ఫ్యాక్టరీని మూసివేసింది. అయితే కరోనా ప్రభావంతో హ్యుండాయ్ కార్ల ఫ్యాక్టరీ ముసివిందన్న వార్త విన్న కొద్దిసేపటికే హ్యుండాయ్ కంపెనీ తన షేర్లను భారీగా నష్టపోయింది. 5 శాతానికి పైగా షేర్లు పడిపోయినట్టు తెలుస్తుంది.

చైనా తరువాత కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న దేశం దక్షిణ కొరియానే… ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో హ్యుండాయ్ సంస్థ మూతపడటంతో మళ్ళీ గందరగోళం మొదలవుతుంది.































