Kranthi Baliwada: ప్రకాష్ రాజ్ అంటే చాలా భయం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి..!
Kranthi Baliwada: క్రాంతి బలివాడు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను ప్రారంభించింది. పలు సీరియల్స్ కు ఆమె డబ్బింగ్ చెబుతున్న సమయంలోనే ఆమెకు సీరియల్స్ లో నటించడానికి ఆఫర్లు వచ్చాయి. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తిరమైన అంశాలను ప్రస్తావించారు.
ఆమె ఏం మాట్లాడారంటే.. డబ్బింగ్ నుంచి .. ఆర్టిస్ట్ గా మారానని.. ఆర్టిస్టుగా చేస్తున్న సమయంలో నా వాయిస్ వేరే వాళ్లు చెప్పేవారన్నారు. తాను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని.. తన కెరీర్ లో చాలా మంది తనకు సపోర్టు చేశారన్నారు. ఇక సీరియల్స్ లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నా.. సినిమాల్లో వాళ్లకు ఆఫర్లు రావని తెలిపారు.
అందుకే తాను చాలా రోజుల వరకు సీరియల్స్ లో నటించలేదని.. తర్వాత సినిమాల్లో ఆఫర్లు వచ్చాయన్నారు. ఇక తెలుగులో ఆర్టిస్టులకు చాలామంది ఆఫర్లు రావడం లేదని ఫీల్ అవుతున్నారని.. అయితే స్కిన్ షో చేయడానికి బాలీవుడ్ యాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని.. అందుకే వాళ్లకు ఎక్కువగా ఆఫర్లు వస్తాయని అన్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ తనతో అన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.
ఇక ప్రకాష్ రాజ్ గురించి చెబుతూ.. అతడు అంటే ఎవరైనా బయపడతారని.. అతడికి తెలుగు బాగా అలవాటైపోయిందని అన్నారు. అందుకే అతడు డైలాగ్స్ సులువగా చెప్పగలడు అంటూ చెప్పారు. ఇక సీరియల్స్ లో యాక్ట్ చేసే సమయంలో ఎప్పుడూ భయంగా ఉంటుందని.. సీనియర్లతో చేసే సమయంలో షూటింగ్ షాట్ ఫెయిల్ కాకూడదనే టెన్షన్ ఉంటుందని అన్నారు. ఇక తాను డబ్బింగ్ ఆర్టిస్టు కావడం వల్ల డైలాగ్స్ బాగా గుర్తుంటాయని చెప్పుకొచ్చింది. ఇక కొన్ని సినిమాల్లోకి సీన్లు చేసే సమయంలో ఇంత కఠినంగా ఉంటాయా అని అనిపించిందన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…