ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణార్థ గోళంలో నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన రోజున సంక్రాంతిగా జరుపుకుంటారు.దేశం మొత్తం వివిధ రకాల పేర్లతో ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగను మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులపాటు ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి, వివిధ రకాల పిండి వంటలు తయారు చేసి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి:
భోగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం పుట్టింది. భోగం అంటే మంచిది అని అర్థం. ఈ భోగి పండుగ జరుపుకోవడం వల్ల భోగభాగ్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకోవడంతో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ఈ భోగి రోజు సాక్షాత్తు గోదాదేవి శ్రీమన్నారాయణలో ఏకమైనదని భావిస్తారు. భోగి రోజు ఉదయం స్నానాలు ఆచరించి ఇంటి ముందు భోగి మంటలను వేసుకొని పాతకు స్వస్తి చెప్పి కొత్త దనాన్ని ఆహ్వానిస్తారు. ఈ భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు.ఈ విధంగా ఎంతో ఘనంగా భోగి పండుగను నిర్వహించుకుంటారు.
సంక్రాంతి ప్రత్యేకత:
భోగి తర్వాత రెండవ రోజున సంక్రాంతిగా జరుపుకుంటారు. ధనుర్మాసం నుంచి సూర్యుడు ఉత్తరాయణ దిశగా పయనించి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రోజున మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున ఇంటి ముందు అందమైన రంగ వల్లులను దిద్ది అందులో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను వివిధ రకాల పువ్వులతో అలంకరించి ముగ్గు మధ్యలో పెడతారు. అంతే కాకుండా హరిదాసు గీతాలు, గంగిరెద్దుల కోలాహలం ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. అంతే కాకుండా సంక్రాంతి పండుగకు రైతులు పండించే పంటలు అన్ని ఇంటికి చేరుకోవడం ద్వారా కూడా ఈ పండుగను రైతుల పండుగ అని పిలుస్తారు. సంక్రాంతి రోజు దానాలు చేయడం వల్ల పుణ్య ఫలం కలుగుతుంది. ఈ విధంగా సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.
కనుమ:
సంక్రాంతి పండుగలో భాగంగా చివరి రోజున కనుమగా పురస్కరించుకుంటారు. ఈ కనుమ పండుగను తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పాడి పశువుల పాకలలో శుభ్రంగా కడిగి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కనుమ రోజు కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు.ఈ కోడిపందాలను చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటారు.ఈ విధంగా మూడు రోజులపాటు సంక్రాంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…