Inspector Bendi Venkatarao : విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన న్యాయవాది వృత్తి చేస్తున్న గోదావరి మధుసూదన్ అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్ళు తన భార్యను చీకటి గదికి పరిమితం చేసాడు. పుట్టపర్తి కి చెందిన సాయి సుప్రియ అనే మహిళను 2008లో వివాహం చేసుకున్న గోదావరి మధుసూదన్ ఆమెను ఏకంగా 13 ఏళ్లుగా చీకటి గదికి పరిమితం చేసారు. కోర్ట్ సహాయంతో పోలీసులు ఆమెను నేడు విడుదల చేయగా 13 ఏళ్ల తరువాత ఆమె మొదటి సారి వెలుతురు చూసింది. ఇంత శాడిస్ట్ గా ఉన్న మధుసూదన్ రావు అతని కుటుంబం ఈ ఘటన మీద సమర్తించుకోవడం ఆశ్చర్యకరమైన విషయం.

మేము ఇంట్లోకి వెళ్లేసరికి…
దాదాపు 13 ఏళ్లుగా కూతురు ఎలా ఉందో తెలియక అల్లాడిన సాయి సుప్రియ తల్లిదండ్రులు చివరకు ఆమెను చూపించాలని కోర్ట్ ను ఆశ్రయించారు. అలా పోలుసులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు, స్థానిక విఆర్ఓ సహాయంతో పోలీసులు మధుసూదన్ ఇంటిని తనిఖీ చేయగా సాయి సుప్రియ ఒక చీకటి గదిలో ఉండటం చూసారు. ఆమె బాగా బలహీనంగా ఉంది అంటూ ఇన్స్పెక్టర్ బెండి వెంకటరావు గారు తెలిపారు.

బయటకు ఆమెను తీసుకురాగానే వెలుతురు చూడగానే కళ్ళు గట్టిగా మూసుకుందని చీకటిలో ఇన్నేళ్లు ఉండటం వల్ల తాను వెలుతురు చూడలేక పోయిందని చెప్పారు. ఇక ఆమెను తన భర్త మానసికంగాను, శరీరకంగాను హింసించాడు అంటూ సాయి సుప్రియ తెలిపారని బెండి వెంకటరావు తెలిపారు. కోర్ట్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆమెను తన తల్లిదండ్రుల వద్ద ఉంచినట్లు చెప్పారు.



























