సహజత్వం ఉట్టిపడేలా నటించే అతి కొద్దిమంది హీరోయిన్స్ లలో సౌందర్య ఒకరు. తెలుగు సినీ ప్రేక్షకులు సౌందర్యను తెలుగు ఆడపడుచుల చూసుకున్నారు. తన నటనతో మహా నటీమణులను మైమరిపించే ప్రయత్నం చేసిన సౌందర్య దాదాపుగా ఆ స్థానాన్ని చేరుకుందనే చెప్పాలి. పుష్కర కాలం పాటు సినీ పరిశ్రమలో వెలుగొందిన సౌందర్య అనతి కాలంలోనే అందరినీ విడిచి వెళ్ళిపోయింది.
కర్ణాటక, అష్టాగ్రామంలో జన్మించిన సౌందర్య, తల్లిదండ్రుల కోరిక మేరకు కు ఎంబిబిఎస్ చేయాలనుకున్నారు. ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలోనే ఆమెకు తన తండ్రి స్నేహితుడి ద్వారా “గంధర్వ” అనే సినిమాలో నటించారు. తన తల్లిదండ్రులు సౌమ్య అనే పేరు పెట్టారు. కానీ అనుకోకుండా సినిమాల్లోకి రావడంతో సౌమ్య కాస్త సౌందర్య గా మారింది.
1993 దశరథరాజు నిర్మాతగా, రామచంద్రరావు దర్శకత్వంలో “మనవరాలి పెళ్లి” చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రంలో హరీష్, సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు. తెలుగులో సౌందర్యకు మనవరాలి పెళ్లి మొదటి సినిమాగా పేర్కొనవచ్చు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన ఆమె తెలుగు సినీ ప్రస్థానం 2004 వరకు సౌందర్య వెనుతిరిగి చూడలేదు. తెలుగులో మాయలోడు రాజేంద్రుడు-గజేంద్రుడు, నెంబర్ వన్, అమ్మోరు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, రాజా, రిక్షావోడు, అన్నయ్య, చూడాలని ఉంది, అంతపురం, లాంటి చిత్రాల్లో సౌందర్య నటించారు.
హిందీలో అమితాబ్ బచ్చన్ తో “సూర్యవంశ్” చిత్రంలో ఆయన సరసన హీరోయిన్ గా నటించింది. అమ్మోరు, అంతపురం, రాజా సినిమాలకి మూడు నంది అవార్డులు సౌందర్య పొందారు. కన్నడంలో గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో “ద్వీప” అనే చిత్రాన్ని ఆమె నిర్మించారు. 2004లో వచ్చిన లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కరీంనగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థి విద్యాసాగర్ తరపున ప్రచారానికి వస్తున్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
అయితే ఆమని ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో తనకు సౌందర్యకు మంచి స్నేహం ఉండేదని.. ఓ సందర్భంలో సినిమాలలో ఎందుకు ఎక్స్పోజింగ్ చేయవు అన్న ప్రశ్నకు.. సౌందర్య సమాధానమిస్తూ.. ఇప్పుడు సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేస్తే రేపు తనను పెళ్లి చేసుకున్న భర్తకు ఏమని సమాధానం చెప్పాలి అనడంతో తను మౌనంగా ఉండి పోయానని.. ఆ ఇంటర్వ్యూలో ఆమని చెప్పుకొచ్చారు. తిరిగిరాని లోకాలకు వెళ్ళినా సౌందర్య స్థానాన్ని మరెవరూ పూరించ లేకపోయారన్నది సినీ పరిశ్రమ ఎరిగిన సత్యం.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…