ఈ నటి ముఖము అందమైన రోజా పువ్వులా వికసిస్తుంది. ఆమె గాత్రము చిలుక పలుకుల్ని మైమరిపిస్తుంది. బాలనటిగా ఎస్.వి.రంగారావు తో అభినయించింది. సావిత్రమ్మతో నటించింది. మద్రాసులో పుట్టి పెరిగిన రోజారమణి. ఐదు సంవత్సరాల వయసులోనే ఈస్ట్ మన్ కలర్ భక్తప్రహ్లాద సినిమాతో తెలుగు తెరపై కనిపించిన రోజా రమణి దాదాపు 70 కి పైగా సినిమాల్లో బాలనటిగా చేసింది. అందులో సత్య కాలపు సత్తయ్య, అరుంధతి, రామాలయం, జరిగిన కథ వంటి చిత్రాల్లో నటించింది. బాల నటుల వయస్సు 12 సంవత్సరాలు దాటితే ఇక సినిమా అవకాశాలు దొరకడం చాలా కష్టం ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి వారికి ఎలాంటి పాత్రలు ఉండవు.

ఆ క్రమంలో రోజారమణి మెల్లిగా సినిమా అవకాశాలు తగ్గడంతో చాలా బాధ పడుతూ ఉండేది. అయితే అలా ఒకసారి రోజా రమణి తన 13 సంవత్సరాల వయసులో శంబరతి అనే మలయాళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అదే సినిమాను తెలుగులో కన్నె వయసు గా రిమేక్ చేశారు. ఇక్కడ కూడా అద్భుత విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దక్షినాది చిత్రాల్లోనే కాకుండా ఒరియా హిందీ చిత్రాల్లో కూడా నటించింది. ఆ తర్వాత మురళీమోహన్ సలహా మేరకు తనకు ఇష్టం లేకున్నా సినీ కథానాయికలకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. అయిష్టంగా ప్రారంభించిన రోజారమణి సుహాసిని, రాధిక, విజయశాంతి, రాధా, రజిని, ఊర్వశి, మీనా, రోజా, రమ్యకృష్ణ లాంటి ఎంతో మంది కథానాయికలకు తన గాత్రాన్ని దాదాపు 400కు పైగా చిత్రాలకు అందించింది.

తెలుగువాడైన ఒరియా చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న చక్రపాణి నుంచి రోజా రమణి వివాహమాడారు. ఆ తర్వాత ఒరియాలో రోజారమణి, చక్రపాణి లు నటించారు. వీరిద్దరికీ నువ్వే కావాలి హీరో తరుణ్ జన్మించాడు. అయిష్టంగా డబ్బింగ్ మొదలు పెట్టినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఆ సినిమాలే రోజారమణి కి మంచి పేరు తీసుకువచ్చాయి. ప్రముఖుల శుభకార్యాలలో లేదా ఎయిర్పోర్టులో ఎవరైనా కలిసినప్పుడు నువ్వు “ఏ దివిలో విరిసిన పారిజాతమో….” (కన్నె వయసు) ఆ సినిమాలో నటించారు కదా. లేదా “ఏమని వర్ణించను ఈ కంటి వెలుగు ను వెన్నంటి మనసును..(డ్రైవర్ రాముడు) ఈ పాటలో నటించింది మీరే కదా అని అడిగేవారు. ఐతే ఈ రెండు చిత్రాల్లో ఏదైనా ఒక పాట పాడేవారు అలా ఒకప్పటి హీరోయిన్ రోజా రమణిని అభిమానులు గుర్తుపట్టేవారు.































