Connect with us

Featured

డైరెక్టర్ శంకర్ ఏ స్వాతంత్ర పోరాట నాయకుడిపై ఇష్టంతో భారతీయుడు సినిమా తీశాడో మీకు తెలుసా.?!

Published

on

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు దమనకాండను పంటి బిగువున నిలిపి స్వేచ్ఛా వాయువులను పురిటి నొప్పులతో రక్తాశ్రువులు చిందిస్తూ తెల్లదొరల దాస్య శృంఖలాల నుండి భారతావని విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర పోరాట సమరయోధులు ఎందరో మరెందరో..

వారి త్యాగ ఫలానికి భారతీయుడు మోకరిల్లి వందనాలు చేయాల్సిందే… కానీ నేడు కుహన రాజకీయాల ఏలికలో 75 వసంతాలకు చేరువవుతున్న భారతావని.. సగటు భారతీయుడు అజ్ఞానం, అవివేకం, అవినీతి, లంచగొండితనం సగటు మనిషిని కాలసర్పంలా ఇంకా కాటేస్తూనే ఉన్నాయి. అలాంటి ప్రతికూల విషయాలపై దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రమే భారతీయుడు సినిమా.

ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ లో సుభాష్ చంద్రబోస్ అంటే డైరెక్టర్ శంకర్ కు చాలా ఇష్టం. ఆయన ఇంకా బతికి ఉంటే ఇప్పటి పరిస్థితులను చూసి ఆయన ఏం చేసేవారు. అనే కాన్సెప్ట్ లో నుంచి వచ్చినదే భారతీయుడు చిత్రం. ఈ చిత్రానికి నటీనటుల విషయంలో స్వాతంత్ర పోరాటం చేసిన వృద్ధుడు పాత్ర లో కమల్ హసన్ నటించగా, ఆయన కొడుకు పాత్రలో ముందుగా అజిత్ ను అనుకున్నారు. కానీ చివరికి కమల్ హాసన్ ఆ పాత్రను పోషించారు. హీరోయిన్స్ గా ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టిని అనుకున్నప్పటికీ, ఒక యాడ్ ఏజెన్సీకి ఇచ్చిన కమిట్మెంట్ లో భాగంగా ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో చేయలేకపోయింది. అలాగే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శిల్పా శెట్టి కూడా భారతీయుడు చిత్రాన్ని వదులుకుంది.

అయితే అప్పటికే బొంబాయి సినిమా విడుదలై అద్భుత విజయాన్ని సాధించడంతో.. అందులో నటించిన మనిషా కొయిరాల మొదటి హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత రెండో హీరోయిన్ గా సూపర్ హిట్ రంగీలా చిత్రం లో నటించిన ఊర్మిళ ను ఎంపిక చేసుకున్నారు. వృద్ధ కమలహాసన్ కు జోడిగా ముందుగా రాధికను అనుకున్నప్పటికీ ఆమె కొన్ని టీవీ సీరియల్స్ లో బిజీగా ఉండడంతో ఆమె ప్లేస్ లో సుకన్య ను తీసుకున్నారు.

భారతీయుడు చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏ.ఆర్. రెహమాన్ ను ఎన్నుకున్నారు. అప్పటికే ఆయన ఇచ్చిన పాటలు ఏ.ఆర్.రెహమాన్ హిస్టరీ లోనే ది బెస్ట్ గా మిగిలిపోయాయి. వృద్ధుడి పాత్రలో కనిపించే కమలహాసన్ కు మేకప్ వేయడానికి అమెరికా నుంచి ప్రత్యేకమైన మేకప్ మెన్ రావడం జరిగింది. దాదాపు కమలహాసన్ మేకప్ కోటి రూపాయలు ఖర్చు చేశారు. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన అనే పాటను ఆస్ట్రేలియాలో చిత్రీకరించడం జరిగింది.

ఆస్ట్రేలియాలో చిత్రీకరించిన మొదటి దక్షిణాది చిత్రం భారతీయుడు. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ ఆ రోజుల్లో 14 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఖర్చు విషయంలో ఏ.ఎం, రత్నం ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అదిరేటి డ్రెస్సు మీరేస్తే అనే పాటకు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. 1995 లో వచ్చిన భాషా మూవీ అప్పటికే 38 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది. భాషా చిత్రం వసూళ్లను దాటాలి అంటే దాదాపు ఐదు సంవత్సరాలు అయిన గడవాలి అని అనుకున్నారు. కానీ కేవలం ఒక సంవత్సరం లోపే 1996 మే లో భారతీయుడు సినిమా విడుదలై 55 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అంటే దాదాపు భారతదేశంలోని అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో మొదటిది హమ్ ఆప్కే హై కౌన్, రెండవది దిల్వాలే దుల్హానియా లేజాయింగే, మూడవ స్థానంలో భారతీయుడు సినిమా నిలిచింది. ఇందులో నటించిన నటశిఖర కమలహాసన్ కి, తన సృజనాత్మకతో ఈ సినిమాని అద్భుతంగా మలిచిన శంకర్ కు సెల్యూట్ కొట్టాల్సిందే.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Manoj -Charan: అర్ధరాత్రి ఫోన్ చేసి 5 లక్షలు అడిగాను.. చరణ్ మంచి మనసు పై మనోజ్ కామెంట్స్!

Published

on

Manoj -Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ మార్చ్ 27వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే . ఈ పుట్టిన రోజు సందర్భంగా ఈయన తన భార్య కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే అంతే కాకుండా చరణ్ అంటే మనోజ్ కి చాలా అభిమానం అని పలు సందర్భాలలో తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఎప్పుడు చెప్పుకోలేదు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు సహాయం పొందిన వాళ్లు ఆయన మంచితనం గురించి చెబుతూ ఉంటారు.

Advertisement

ఆడబిడ్డకు సాయం..
ఈ క్రమంలోనే చరణ్ మంచితనం గురించి మనోజ్ మాట్లాడుతూ 2018 వ సంవత్సరంలో నేను అమెరికాలో ఉన్నాను. అర్ధరాత్రి సమయంలో దుబాయిలో ఓ ఆడబిడ్డ తన కుమార్తెతో కలిసి ఇమిగ్రేషన్ సమస్య కారణంగా అక్కడే చిక్కుకుపోయారు వెంటనే ఐదు లక్షలు కావాలి అని అడిగింది అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి చరణ్ కి ఫోన్ చేసి ఐదు లక్షల కావాలి అంటే ఎందుకు అని కూడా అడగకుండా ఐదు నిమిషాలలో పంపించారంటూ తన సహాయ గుణం పై మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vijay Devarakonda: సినిమా సక్సెస్ కోసం పూజలు చేసిన ఫ్యామిలీ స్టార్… సక్సెస్ అయ్యేనా?

Published

on

Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా ఈయన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక త్వరలోనే పరశురాం దర్శకత్వంలో నటించినటువంటి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మంచి సక్సెస్ అందుకోవాలనే ఉద్దేశంలో విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలను చేశారు ఈ క్రమంలోనే దిల్ రాజు ఆఫీస్ లో దర్శక నిర్మాతలు హీరోలతో కలిసి ప్రత్యేకంగా హోమాలు పూజలను చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

సినిమా విజయం కోసమే పూజలు..
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా సక్సెస్ కోసం విజయ్ దేవరకొండ ఇలాంటి పూజలు చేయించారని అయితే ఈ పూజలు సక్సెస్ అయ్యి తన సినిమా మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ ఈ సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు పెంచాయి.

Advertisement
Continue Reading

Featured

Siddharth -Aditi: రహస్యంగా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన అదితి సిద్ధార్థ్?

Published

on

Siddharth -Aditiy: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో
సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి అవే భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో కలిసిన నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు..

ఇక వీరిద్దరూ కలిసి ముంబైలో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి జంటగా వెళ్లారు. అయితే వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ వీరు మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. ఇలా రహస్యంగా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఈ జంట ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ముంబైలో సహజీవనం చేస్తున్నటువంటి ఈ జంట తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతారు.

Advertisement

తెలంగాణలో వివాహం..
రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అయితే ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరికీ ఇది మొదటి వివాహం కాదని వీరిద్దరికీ ఇది రెండో వివాహమనే చెప్పాలి ఇప్పటికే వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటూ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!