Connect with us

Featured

స్వాతంత్య్ర ఉద్యమానికి పార్లె-జి బిస్కట్ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా.. ?

Published

on

పార్లె-జి బిస్కెట్ కంపెనీల్లో ఓ సంచలనం. మల్టీనేషనల్ కంపెనీలకు సైతం ముచ్చెమటలు పట్టించిన అచ్చమైన భారతీయ సంస్థ. ప్రస్తుతం అంటే రకరకాల బిస్కెట్లు అందుబాటులోకి వచ్చాయి కానీ.. గతంలో పార్లే-జి ఒక్కటే దేశంలోని ప్రతి ఇంటి గడపతొక్కింది అని చెప్పుకోవచ్చు. భారతీయులకు ఈ బిస్కెట్లతో ఎంతో అనుభంధం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నా.. లేకున్నా.. జనాల ఆదరణ మాత్రం తగ్గలేదు. ఎందుకు జనాలకు ఈ కంపెనీ బిస్కెట్లపై అంత నమ్మకం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

1929వ సంవత్సరంలో మన దేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తున్నారు. అప్పట్లో విదేవీ వస్తు బహిష్కరణ.. స్వదేశీ వస్తువుల వాడకంపై దేశ వ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుంది. అదే సమయంలో భారత్ లో యునైటెడ్ బిస్కెట్లు, హంట్లీ పామర్స్ , బ్రిటానియా, గ్లాస్కో కంపెనీల బిస్కెట్లు రాజ్యం ఏలుతున్నాయి. మనకంటూ ఓ బ్రాండ్ బిస్కెట్లు లేదు. అందుచేత భారతీయులకు ఓ కంపెనీ ఉండాలని ముంబైకి చెందిన సిల్క్ బిజినెస్ మ్యాన్.. మోహన్ లాల్ దయాల్ జర్మనీకి వెళ్లాడు. అక్కడ బేకరీ వస్తువుల తయారు చేసే విధానం, ఇందుకోసం వాడే యంత్రాల గురించి తెలుసుకుని వచ్చాడు. వచ్చే సమయంలో అప్పట్లోనే రూ. 60 వేలు పెట్టి బేకరీ ఐటెమ్స్ తయారు చేసే యంత్రాలను భారత్ కు తీసుకొచ్చాడు.

ముంబైలోని ఇర్లా అండ్ పార్లా అనే ఏరియాలో ఓ చిన్న ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. అందులో మొదట్లో 12 మంది మాత్రమే పనిచేసేవారు. వారుకూడా మోహన్ లాల్ ఫ్యామిలీ మెంబర్సే. తొలి రోజుల్లో ఆరెంజ్ క్యాండీ, టాఫీలు మాత్రమే ఉత్పత్తి చేసేవారు. 10 ఏండ్ల తర్వాత ఆ కంపెనీ ఉన్న పార్లా పేరుతో పార్లే అనే పేరు కంపెనీకి పెట్టాడు. స్వదేశీ వస్తువుల వాడకంతో మొదలైన ఉద్యమం సందర్భంగా బిస్కెట్లు తయారు చేయడం మొదలు పెట్టింది ఈ కంపెనీ. రెండో ప్ర‌పంచ యుద్ధం సమయంలో పార్లె కంపెనీ పార్లె గ్లూకో పేరుతో బిస్కెట్లు తయారు చేసి అమ్మింది.

అప్పట్లో బ్రిటిష్ కంపెనీలను తట్టుకుని పార్లె బిస్కెట్లు విస్తరించాయి. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం నేపథ్యంలో జనాలంతా మన దేశానికి చెందిన పార్లె బిస్కెట్లను మాత్రమే కొనేవారు. దీంతో జనాలకు పార్లెకు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. స్వాతంత్రం అనంతరం పార్లె కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయినా కొత్త ఉత్పత్తులను మొదలు పెట్టి మిగతా కంపెనీలకు దడ పుట్టించింది. పార్లె గ్లూకోను కాస్త పార్లె-జిగా మార్చింది. అద్భుత ప్రకటనలతో జనాలను ఆకట్టుకుంది. స్వచ్చమైన స్వదేశీ బ్రాండ్ గా పార్లె-జి నిలిచిపోయింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!