భారత దేశంలో కరోనా రెండో దశ ఏ విధంగా వ్యాప్తి చెందిందో మనకు తెలిసిందే. రోజురోజుకు కేసులో పెరుగుతుండడంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ విపత్కర పరిస్థితులలో నుంచి మన దేశాన్ని ఆదుకోవడం కోసం ఎంతోమంది తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటిస్తూ ఆక్సిజన్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశం ఈ సంక్షోభం నుంచి బయటకు రావాలని కొన్ని దేశాల ప్రజలు దేవుని ప్రార్థిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దేశంలో భారత దేశం కోసం ‘ఓం నమః శివాయః’ అంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు.ప్రస్తుతం ఇండియాలో ఏర్పడిన ఈ విపత్కర పరిస్థితి నుంచి భారత ప్రజలను కాపాడాలని ఆ దేశంలోని ప్రజలు ప్రధాన కూడళ్ల వద్ద శివలింగాలను ఏర్పాటు చేసే పెద్ద ఎత్తున భారత దేశం కోసం ఓం నమ శివాయ అంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ అధికారి పవన్ కె పాల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇటీవల ఈ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఇజ్రాయిల్ ప్రజలు ఓం నమ శివాయ అంటూ శివుని ప్రార్థించడం మనం చూడవచ్చు.ఈ మహమ్మారి నుంచి భారత ప్రజలను కాపాడాలని వీరు చేస్తున్న ప్రార్థనలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/COdefuNDmXq/?utm_source=ig_web_copy_link
ఈ వీడియో చూసిన భారతీయ నెటిజన్లు తమ దేశం కోసం ప్రార్థిస్తున్న ఇజ్రాయిల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీరు చేస్తున్న ఈ ప్రార్థనలు భారతదేశాన్ని ఈ సంక్షోభం నుంచి బయటపడేస్తాయని, ఈ ప్రార్థనలు మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని, తొందరలోనే భారతదేశం ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…