'I've been going through hell for five years, please help me', says actress Tanushree Dutta
న్యూ ఢిల్లీ: బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లోకి వచ్చారు. చాలా కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో ద్వారా అభిమానులను కలిచివేశారు. ఆ వీడియోలో ఆమె కన్నీళ్లతో మాట్లాడుతూ “నాకు సహాయం చేయండి, నేను నా ఇంట్లోనే హరాస్మెంట్కి గురవుతున్నాను” అని వాపోయారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఈ హింస 2018లో ఆమె #MeToo ఉద్యమంలో పాల్గొన్న తర్వాతే ప్రారంభమైందట. “I’m sick and tired of this harassment!! It’s been going on since 2018. Aaj fed up hokar maine police ko call kiya. Please someone help me! Do something before it’s too late,” అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.
తన ఇంట్లోనే ఈ వేధింపులు జరుగుతున్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. “నాకు అంతగా మానసికంగా క్షీణత వచ్చిందని, ఆరోగ్యం పాడైపోయిందని, ఇంటి పరిస్థితి పూర్తిగా మానసిక అశాంతిని ప్రతిబింబిస్తోందని” ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“నాకు సరైన మైద్స్ను కూడా పెట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే గతంలో నా ఇంట్లో పనివారిగా వచ్చిన వారే వస్తువులు దొంగిలించారు. వారు ముందుగానే ప్లాన్ చేసి పంపిన వారేమోననే అనుమానాలు ఉన్నాయి,” అని తనుశ్రీ అన్నారు.
ఆమె చేసిన ఈ పోస్టుకు ప్రేక్షకుల నుండి పెద్ద సంఖ్యలో స్పందన వస్తోంది. అభిమానులు, నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతూ, వెంటనే సాయం అందించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.
తనుశ్రీ గతంలోనూ నానా పాటేకర్పై #MeToo ఆరోపణలు చేయడంతో సంచలనానికి కేంద్రబిందువయ్యారు. ఇప్పుడు ఆమె చేస్తున్న ఈ అభ్యర్థన ఆమె వ్యక్తిగత జీవితం ఎంత గాయపడిందో స్పష్టంగా చెబుతోంది. ఆమెకు సహాయం చేసేందుకు సంఘటితంగా ప్రభుత్వ యంత్రాంగం, సినీ పరిశ్రమ ముందుకు రావాలన్నది నెటిజన్ల డిమాండ్.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…