Jagapathi Babu: జగపతిబాబు సింహస్వప్నం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జగపతిబాబుకు అనంతరం అవకాశాలు తగ్గిపోయాయి ఇలా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈయనకు లెజెండ్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన జగపతిబాబుకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక జగపతిబాబు ఇండస్ట్రీలోకి వచ్చే ముందే ఈయన రాజేంద్రనాథ్ అనే ప్రముఖ నిర్మాత కుమారుడు. వారసత్వంగా జగపతిబాబు వందల కోట్ల రూపాయల ఆస్తులను అందుకున్నారు. ఇక సినిమాలలో కూడా భారీగా సంపాదించారు కానీ వీటన్నింటినీ ఈయన కోల్పోయారు.
ఈ విధంగా జగపతిబాబు 100 కోట్ల ఆస్తులను పోగొట్టుకోనీ చివరికి తాను అంటున్నటువంటి ఇంటిని కూడా అమ్మేయాలని భావించారు. అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో లెజెండ్ ఈయనకు తిరుగులేని విజయాన్ని అందించిందని చెప్పాలి.అయితే జగపతిబాబు వందల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా పోగొట్టుకున్నారు అనే విషయానికి వస్తే ఆయనకు క్యాసినో గ్యాబ్లింగ్ వంటి అలవాట్లు ఉన్నాయి వీటి ద్వారా వంద కోట్ల రూపాయల ఆస్తులను పోగొట్టుకున్నారు. అదేవిధంగా కొందరుకు డబ్బు ఇచ్చి కూడా వారు తిరిగి ఇవ్వకపోవడంతో నష్టపోయారని తెలుస్తుంది.
ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి సమయంలో తన వద్ద రెండు ఫోన్లు ఉన్నాయని ఎవరైనా ఫోన్ చేసి తనకు అవకాశం ఇస్తారేమోనని ఎదురుచూస్తూ ఉండేవాడిననీ తెలిపారు. సెకండ్ ఇన్నింగ్స్ తనకు అవకాశాలు వస్తే ఒక 30 కోట్ల రూపాయలు సంపాదించుకొని జీవితాంతం హ్యాపీగా సెటిలైపోతానని భావించాను. కానీ సెకండ్ ఇన్నింగ్స్ 30 కోట్ల కన్నా ఎక్కువగానే సంపాదించానని మిగిలినదంతా బోనస్…తనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు చాలా సంతోషంగా ఉన్నానని జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…