Janhvi Kapoor: అమ్మ నన్ను పట్టుకుని కూర్చుంది… శ్రీదేవితో ఆఖరి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయినా జాన్వీ!

Janhvi Kapoor: అందాల తార దివంగత నటి శ్రీదేవి మరణ వార్త ఇప్పటికి ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. సినిమాలలో అన్ని భాషలలో నటిస్తూ ఎంతోమంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె దుబాయ్ లో టబ్ బాత్ లో మరణించి విగత జీవిగా కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.

ఇలా శ్రీదేవి మరణించిన తర్వాత తన కుమార్తె వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే శ్రీదేవి ఉన్న సమయంలోనే జాన్వీ కపూర్ ధడక్ సినిమా అవకాశాన్ని అందుకొని ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తన తల్లి తనతో గడిపిన ఆఖరి క్షణాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తాను అప్పటికే దడక్ సినిమా షూటింగ్లో పాల్గొనడంతో అమ్మతో గడపడానికి సమయం లేకుండా పోయింది.

అమ్మ ఉదయమే దుబాయ్ వెళ్లాలి నైట్ తన గదిలో లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు. నేను షూటింగ్ నుంచి వచ్చి అమ్మ గదికి వెళ్ళగా తన బిజీగా ఉన్నారు. దాంతో నేను నా గదికి వెళ్లి పడుకున్నాను.అమ్మ పనులన్నీ ముగించుకొని నా గదికి వచ్చిందని అయితే అప్పటికే నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకున్నాను. నేను అలా చెప్పినప్పటికీ అమ్మ అక్కడే ఉందన్న విషయం నాకు తెలుసు.

Janhvi Kapoor: అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు…


నేను నిద్రపోతూ ఉండగా అమ్మ నా దగ్గరకు వచ్చి నా తలపై చేయి వేసుకొని అలాగే కూర్చున్నారు. ఇదే నేను అమ్మతో గడిపిన ఆఖరి క్షణాలు అంటూ ఈ సందర్భంగా జాన్వి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమ్మ మరణం తర్వాత కుటుంబమంతా ఒక్కటే అయ్యాము. కానీ అమ్మలేని లోటును ఎవరు తీర్చలేరు అంటూ ఈ సందర్భంగా జాన్వీ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.