Neha Shetty: హీరోయిన్ పుట్టు మచ్చల గురించి మాట్లాడిన జర్నలిస్ట్… ఆగ్రహం వ్యక్తం చేసిన నేహా శెట్టి!
Neha Shetty: సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ల పై రోజుకి ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హీరోయిన్ల గురించి తప్పుగా మాట్లాడటం..వారి గురించి లేనిపోని వార్తలు రావడం సర్వసాధారణం అయ్యింది.అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ల గురించి ఈ విధమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో సదరు హీరోయిన్ స్పందిస్తూ ఘాటుగా సమాధానం చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఇలాంటి చేదు అనుభవం నటి నేహా శెట్టి కి కూడా ఎదురయ్యింది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ సురేష్ కొండేటి హీరోయిన్ పుట్టుమచ్చల గురించి తప్పుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరోయిన్ చేతల 16 పుట్టుమచ్చలు అని చెప్పారు నిజంగా ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఈ విధంగా జర్నలిస్ట్ తన పుట్టు మచ్చల గురించి అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేహా శెట్టి ఈ వీడియోని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు ట్రైలర్ లాంచ్ లో ఈ ప్రశ్న ఎంతో దురదృష్టకరం. తన ఇంట్లో తన చుట్టుపక్కల ఉన్న స్త్రీల గురించి ఎంతటి గౌరవంగా ఉంటారనేది ఈ మాటలను బట్టి అర్థం అవుతుంది అంటూ ట్విట్టర్ ద్వారా ఈ వీడియోని షేర్ చేస్తూ సదరు జర్నలిస్టు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ కి నిర్మాత సూర్యదేవర నాగ వంశీ రిప్లై ఇస్తూ చాలా దురదృష్టకరం అంటూ కామెంట్ చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…