Neha Shetty: హీరోయిన్ పుట్టు మచ్చల గురించి మాట్లాడిన జర్నలిస్ట్… ఆగ్రహం వ్యక్తం చేసిన నేహా శెట్టి!
Neha Shetty: సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ల పై రోజుకి ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హీరోయిన్ల గురించి తప్పుగా మాట్లాడటం..వారి గురించి లేనిపోని వార్తలు రావడం సర్వసాధారణం అయ్యింది.అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ల గురించి ఈ విధమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో సదరు హీరోయిన్ స్పందిస్తూ ఘాటుగా సమాధానం చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఇలాంటి చేదు అనుభవం నటి నేహా శెట్టి కి కూడా ఎదురయ్యింది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ సురేష్ కొండేటి హీరోయిన్ పుట్టుమచ్చల గురించి తప్పుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరోయిన్ చేతల 16 పుట్టుమచ్చలు అని చెప్పారు నిజంగా ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఈ విధంగా జర్నలిస్ట్ తన పుట్టు మచ్చల గురించి అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేహా శెట్టి ఈ వీడియోని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు ట్రైలర్ లాంచ్ లో ఈ ప్రశ్న ఎంతో దురదృష్టకరం. తన ఇంట్లో తన చుట్టుపక్కల ఉన్న స్త్రీల గురించి ఎంతటి గౌరవంగా ఉంటారనేది ఈ మాటలను బట్టి అర్థం అవుతుంది అంటూ ట్విట్టర్ ద్వారా ఈ వీడియోని షేర్ చేస్తూ సదరు జర్నలిస్టు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ కి నిర్మాత సూర్యదేవర నాగ వంశీ రిప్లై ఇస్తూ చాలా దురదృష్టకరం అంటూ కామెంట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…