KA Paul – Pawan Kalyan: గత ఎన్నికలలో రెండు రాష్ట్రాలలో సంచలనగా మారిన పాల్ ప్రజాశాంతి పార్టీ పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు.అయితే కొంతకాలం పాటు రాజకీయాలలో హడావిడి చేసిన పాల్ మధ్యలో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఈయన రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారని ఈ క్రమంలోని తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో పర్యటిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పవన్ కళ్యాణ్ సైతం తన పార్టీని పూర్తిగా ప్రజలలోకి తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు.ఈ విధంగా రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గురించి పాల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని అయితే పవన్ కళ్యాణ్ ను అన్ని పార్టీల వారు పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారని పాల్ పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మంత్రి సీఎం కావాలన్నా ఆయన నా దగ్గరకు వస్తే తనని సీఎంని చేస్తానంటూ పాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా తమ్ముడు నిన్ను అందరూ మోసం చేస్తున్నారు నువ్వు నా దగ్గరికి వచ్చేయ్ అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పాల్ కేవలం పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే కాకుండా జగన్ గురించి కూడా షాకింగ్ కామెంట్ చేశారు.జగన్ కి దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయని వచ్చే ఎన్నికలలో కూడా తాను గెలుస్తారని ఈయన పేర్కొన్నారు. ఇక తాను జగన్ ను కలవడానికి సిద్ధంగా ఉన్నానని లేదా జగన్ అయినా కూడా తనని కలవచ్చు అంటూ ఈ సందర్భంగా ఫాల్ కామెంట్ చేశారు. అయితే ఈసారి ఎన్నికలలో తాను తెలంగాణ నుంచి పోటీ చేసి కేసీఆర్ ను గద్దె దించుతానని ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…