Kantara 2: కన్నడ హీరోగా ఆయన దర్శకత్వంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.
ఇలా ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా ఎన్నోసార్లు ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దర్శక నిర్మాతలు కూడా పలు మార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ పనులను ప్రారంభించినట్లు సమాచారం.
ఈ సినిమా సీక్వెల్ నేపథ్యంలో కర్ణాటక మంగళూరు శివారులోని కద్రి మంజునాథేశ్వర ఆలయాన్ని దర్శించారు. ఈ ఆలయంలో జరిగిన భూతకోలకు హీరో హీరోయిన్లతో పాటు నిర్మాతలు ఇతర చిత్ర బృందం హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణ ఆడిగ సమక్షంలో ‘కాంతార’ సీక్వెల్ నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పంజుర్లి దైవం నుంచి కాంతార సీక్వెల్ చిత్రానికి సంపూర్ణ ఆశీస్సులు లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా సీక్వెల్ విషయంలో పంజుర్లి దైవం హీరో రిషబ్ శెట్టికి కొన్ని కండిషన్ లను కూడా పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎంతో నియమనిష్టలతో దైవభక్తితో షూటింగ్ చేయాలని పంజుర్లి దైవం ఆదేశించినట్టు సమాచారం.కాంతార విషయంలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లాయని అయితే ఆ తప్పులను క్షమించి మరోసారి ఈ సినిమా సీక్వెల్ విషయంలో తప్పులు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఇక సీక్వెల్ చిత్రాన్ని కూడా ఇదే చిత్ర బృందంతో చేయాలని ఆదేశించినట్లు సమాచారం. స్వచ్ఛమైన మనసుతో సినిమా చేస్తే విజయానికి తాను భరోసా ఇస్తానని పంజుర్లి దైవం తన ఆశీస్సులను తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వచ్చే ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించినట్టు తెలుస్తోంది.
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…