ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ పంపిణీ మొదలైన సమస్యలతో ప్రజలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి ఉన్నారు. వీరిని ఆదరించడానికి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు వారికి తోచిన విధంగా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు.ఇదే కోవలో కర్ణాటక రాష్ట్రం లోని మైసూరుకి చెందిన హరీశ్ అనే వ్యక్తి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం మైసూర్ కు చెందిన హరీష్ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అయినను తన కన్న కూతురీ వివాహాన్ని అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించాలని అనుకున్నాడు. దాని కోసం ఈ నెల 12న ముహూర్తం నిర్ణయించి బంధుమిత్రులను ఆహ్వానించాడు.
ఇంతలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అందులో భాగంగా వివాహ వేడుకలు, వివిధ శుభకార్యాల పైన కూడా ఆంక్షలు విధించడంతో హరీష్ చేసేదేమీలేక తన కూతురు వివాహాన్ని లాక్డౌన్ నిబంధనలను అనుసరించి తన ఇంట్లోనే సింపుల్ గా జరిపించాడు.
అయితే హరీష్ తన కూతురు వివాహం కోసం దాచిన డబ్బును లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు పంచాలని నిర్ణయించాడు.పెళ్లి కోసంఖర్చు చేయాలనుకున్న రెండు లక్షల రూపాయలను 40 మంది పేదలకు ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున ఇచ్చి వారికి సాయంగా నిలిచాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమకు తోచిన, చేతనైన సహాయం చేయాలని ప్రజలను కోరుతున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…