Kithakithalu fame Geetha singh : ‘ఎవడి గోల వాడిది’ సినిమాతో కమెడియన్ గా అడుగుపెట్టిన గీతా సింగ్ అంతకు ముందు తేజ గారి సినిమా ‘జై’ లో నటించింది. ఇక ఎవడిగోల వాడిది, సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తరువాత ఏకంగా ‘కితకితలు’ సినిమాతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమా క్రేజ్ తో వరుసగా సినిమాలను చేసిన గీతా సింగ్ దాదాపు ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలలో ఎక్కువగా కనిపించని గీత గ్యాప్ రావడానికి గల కారణాలను వివరిస్తూ తన వ్యక్తిగత విషయాలను కూడా తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆ డైరెక్టర్ కే నేరుగా ఫోన్ చేశా…
గ్యాప్ రావడానికి కారణం ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఎమోషనల్ అయిన గీతాసింగ్ అమ్మ పాత్రకు సరిపోనని అంటున్నారు, అక్క పాత్రలకు నప్పను అంటున్నారు, మీరు కామెడీ పాత్రలు చేయగలరు అవే చేయండని చెబుతున్నారు. పోనీ కామెడీ పాత్రాలనైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు, మన వాళ్లే ఎంతో మంది ఆర్టిస్టులు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారు కానీ ఇండస్ట్రీలో మమ్మల్ని తీసుకోరు. మరికొన్నిసార్లు అవకాశం ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో లేదని చెప్పేస్తారు.

ఒక పెద్ద డైరెక్టర్ సినిమాలో అవకాశం ఇస్తామని వారి అసిస్టెంట్ డైరెక్టర్లు ఫోన్ చేస్తే ఆ ఆఫర్ కోసం 11 సినిమాలను వద్దనుకున్నాను. పాసుపోర్టు అడిగారు, ఇంతవరకు ఫోన్ చేయలేదని నేనే మళ్ళీ కాల్ చేస్తే వేరే వాళ్ళని మీ పాత్రకి తీసుకున్నారు అని చెప్పారు. డైరెక్టర్ గారికి కాల్ చేస్తే నాకసలు మిమ్మల్ని అడిగిన సంగతి తెలియదు అని చెప్పాడు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ పేరు చెప్పను అంటూ గీతా సింగ్ చెప్పారు. ఆ ఒక్క సినిమా కోసం 11 సినిమాలు పోయాయి ఎంతో కొంత డబ్బు వచ్చేది కదా అంటూ బాధపడ్డారు.



























