చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్లే. ఏ చిన్న విషయం జరిగినా వెంటనే మనకు క్షణాల్లో తెలిసిపోతోంది. అందుకే దీనికి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయారు. ఇదిలా ఉండగా.. చాలామందికి వాకింగ్ చేసే సమయంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చేసే అలవాటు ఉంటుంది. అయితే ఇలా వాటిని చెవిలో పెట్టుకుంటూ.. వాకింగ్ లేదు జాగింగ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా.. దీనిపై నిపుణులు ఏమంటున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..
ఆరోగ్యం కోసం ఉదయాన్నే చేసే వాకింగ్ సమయంలో కూడా మొబైల్ వాడుతున్నారు. ఇది సరైంది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ముందుగా ఇలా చేయడం ద్వారా వెన్నెముకకు ఎక్కువగా హాని చేకూరుతుంది.
వాకింగ్ సమయంలో వెన్నెముక నిటారుగా ఉండాలి.. కానీ మొబైల్ ద్వారా పాటలు వింటున్న సమయంలో ఎక్కువగా మొబైల్ స్క్రీన్ పై చూస్తుంటాం. ఇలా చేయడం వల్ల వెన్నెముక షేప్ లో మార్పువస్తుంది.మొబైల్ వాడుకుంటూ వాకింగ్ చేస్తే.. కండరాల నొప్పి కూడా అధికంగా ఉంటుందట. అంతేకాకుండా మెడనొప్పి కూడా ఉంటుందట.
ఏకాగ్రత దెబ్బతిని అడుగులు వేసే సమయంలో తప్పుగా వేస్తుంటాం.. దీంతో ఎక్కువగా ఆ ఒత్తిడి నడుముపై నొప్పి ఎక్కువగా అవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏకాగ్రత అంతా వాకింగ్ పైనే ఉండాలి. ఇలా చేతులను ఊపుకుంటూ.. అడుగు వెనుక అడుగు వేస్తూ చేయాలి. ఫోన్ మాట్లాడుతూ వాకింగ్ చేయడం.. పాటలు వింటూ వాకింగ్ చేయడం వల్ల కేవలం.. మీరు దూరం నడవగలరు కానీ.. దాని వల్ల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం అనేది జరగదు అంటూ నిపుణులు చెబుతున్నారు. ఏకాగ్రత అనేది ముఖ్యం అంటూ చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…