న్యూజిలాండ్ తో జరిగే ప్రపంచ టెస్ట్ చాంఫియన్ షిప్ మొదలవ్వడానికి కొన్నిగంటల ముందు టీం ఇండియా కెప్టెన్ విరాట కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. మాకు సంబందించినంత వరకూ ఇది సాధారణ మ్యాచ్.. కేవలం ఐదు రోజుల్లోని ఆట నిజమైన టీమ్ ఇండియాను ప్రతిబింబించదని కెప్టన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ‘చరిత్రను ఒకసారి చూడండి.. ఇదివరకు చాలా మంది ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయారు.

ఇది ఒక గేమ్.. మేమీ ఫైనల్ గెలిచినా.. ఓడినా.. మా క్రికెట్ ఇక్కడితో ఆగిపోదు. అందుకే ఈ ఫైనల్ను మేము మరీ అంత ప్రత్యేకంగా చూడదలుచుకోలేదు. మాకు ఇదో మరో మ్యాచ్ అంతే. బయటవాళ్లు మాత్రమే అతిగా ఆత్రుత పడతారు. చావోరేవో అన్నట్టు భావిస్తారు’ అని కోహ్లీ అన్నాడు.































