Konda Surekha : తెలంగాణ రాజకీయంలో రాజశేఖర్ రెడ్డి అనుచరులుగా విశ్వాస పాత్రులగా మెలిగిన కొండా దంపతులు ఆయన మరణం తరువాత జగన్ కు దగ్గర కాలేదు. ఇక తెలంగాణ వచ్చాక జగన్ పార్టీ లో చేరి అక్కడ ఇమడ లేక మళ్ళీ టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యే గా గెలిచిన సురేఖ ఇక అక్కడా ఇమడ లేక మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. ఇక రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ మనిషి ఆంటూ చెప్పారు సురేఖ. జగన్ కు అభద్రతా భావం చాలా ఎక్కువ అందుకే ఆయన ఎవరినీ ఓర్చడు అంటూ చెప్పారు సురేఖ.

జగన్, షర్మిల కి అస్థి వివాదాలు ఉన్నాయి…
జగన్ కి తన ముందు ఎవరు ఎదిగినా నచ్చదు. అది ఇంట్లో వాళ్ళైనా సరే అంతే అందుకే షర్మిల రాజకియంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదు. ఆస్తి పంపకంలో గొడవలు వచ్చాయి జగన్, షర్మిల ఇద్దరికీ. ఇక అక్కడ మొదలై ఒకవేళ జగన్ జైలుకి వెళ్లాల్సి వస్తే నేనే సీఎం అవుతా అని అడిగితే జగన్ మాత్రం నా భార్య సీఎం అవ్వాలి అని చెప్పడంతో, అక్కడ గొడవలు ముదిరి హైదరాబాద్ కి షర్మిల వచ్చేసింది.

ఇక విజయమ్మ కూతురు పక్షాన నిలవడం వల్ల ఆమె కూడా హైదరాబాద్ కి వచ్చేసింది. కానీ తెలంగాణ లో పార్టీ పెట్టడం అది ఇప్పుడు షర్మిల తప్పే. తెలంగాణ వచ్చిన మొదట్లోనే పార్టీ పెట్టుండాల్సింది. లేక ఆంధ్రప్రదేశ్ లోనే కాంగ్రెస్ లోనే చేరి పార్టీని బలోపేతం చేయాల్సింది. తన తండ్రి చివరి దాకా ఉన్న పార్టీ లో షర్మిల ఉండుంటే బాగుండేది అని కొండ సురేఖ అభిప్రాయపడ్డారు.






























