Krishna Vamsi : చాలా రోజుల గ్యాప్ తరువాత రంగ మార్తాండా సినిమాతో మళ్ళీ రాబోతున్న కృష్ణ వంశీ తన ముందు సినిమాల గురించిన విషయాలను, విశేషాలను చెప్పారు. గులాబీ సినిమాతో మొదలైన సినిమా ప్రయాణం నిన్నేపెళ్లాడుతా, సముద్రం, అంతఃపురం, ఖడ్గం, మురారి వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.

కాజల్ గురించి రాజమౌళి ఇంటికి వచ్చి…
మగధీర సినిమా సమయంలో కాజల్ ను హీరోయిన్ గా పెట్టుకోవాలని రాజమౌళి అనుకున్నపుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి కృష్ణ వంశీ వద్దకు వచ్చి వాకబు చేసారనే టాక్ ఉంది. ఇక దీన్ని గురించి మాట్లాడుతూ కృష్ణ వంశీ అలాంటిదేమి లేదని, రాజమౌళి చాలా యూనిక్ వ్యక్తి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు అంటూ చెప్పాడు. ఇక పెళ్లే చేసుకోకూడదు అనుకున్న కృష్ణ వంశీ పెళ్లి చేసుకోడానికి కారణం చెప్పారు.

పెళ్లి చేసుకోకుండా ఫ్రీగా ఉండాలని అనుకున్నా కానీ నేనొకటి అనుకుంటే విధి ఇంకోటి అనుకుంది అలా నా పెళ్లి జరిగింది. ఇక పెళ్లయ్యాక నా జీవితంలో ఏం మార్పులు రాలేదు. పెళ్ళికి ముందు ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. రమ్య కృష్ణ నన్ను ఏ నాడు మారమని అనలేదు. నేను తనను మారమని అనలేదు అలా మా ఇద్దరి జీవితాల్లో ఏ మార్పు రాలేదు. మాకు నచ్చినట్టు పని చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం అంటూ చెప్పారు.
































