Krishna Vamsi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తుండిపోయే చిత్రాలు తీసిన దర్శకుడు. కుటుంబ కథా చిత్రాలు తీసినా, సామాజిక నేపథ్యం ఉన్న చిత్రాలు తీసినా కృష్ణ వంశీ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. గులాబీ సినిమాతో మొదలయిన ప్రస్థానం సింధూరం, అంతఃపురం, సముద్రం, నిన్నేపెళ్లాడుతా, మురారి, ఖడ్గం ఇలా డిఫరెంట్ జోనర్స్ ని టచ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న కృష్ణ వంశీ చాలా రోజుల తరువాత మళ్ళీ రంగ మార్తాండా సినిమాతో రానున్నాడు.

ప్రకాష్ రాజ్ ను భరిస్తున్నా…
ప్రకాష్ రాజ్ కి అంతఃపురం, ఖడ్గం, సినిమాలతో గుర్తుండి పోయే పాత్రలు ఇచ్చిన కృష్ణ వంశీ ఆయనతో జరిగిన గొడవల గురించి స్పందించారు. ప్రకాష్ రాజ్, తాను భిన్న ధృవాలు అంటూ చెప్పాడు. ఆయన ఆలోచనలు, నా ఆలోచనలలో చాలా వత్యాసం ఉంటుందని చెప్పారు. చిన్న చిన్న గొడవలు ఇద్దరి మధ్య ఉన్నా కూడా ఎప్పుడూ మనసులు దూరం కాలేదని చెప్పారు కృష్ణ వంశీ. ఒకటీ రెండు రోజులు ఆ గొడవ ఉంటుంది, ఆ తరువాత నేనే వెళ్లి మాట్లాడుతా. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు, ఆయనతో సినిమా నాకు అవసరం అందుకే నేనే వెళ్లి మాట్లాడి సర్దుబాటు చేసుకుంటాము.

మా గురువు ఆర్జీవి చెప్తుంటారు మనిషికి ఇంకో మనిషిని కనెక్ట్ చేసేది అవసరం, ఇష్టం మాత్రమే అని అవి రెండూ కూడా మన స్వార్థమే అంటూ చెప్పారు కృష్ణ వంశీ. నేను కూడా అది నమ్ముతాను, ఒకరి దగ్గరికి వెళ్ళాం అంటే ఒకటి వారిపై ఇష్టమైనా ఉండాలి లేదా అవసరమైనా ఉండాలి. అవి రెండూ కూడా నీ అవసరం, స్వార్థమే కదా అంటూ చెప్పారు.































