Featured

Krishnam Raju : మొదటి భార్య కోసం తన తుది శ్వాస వరకూ ఆ పని చేసిన కృష్ణంరాజు..!

Krishnam Raju : నిన్న తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కృష్ణం రాజు గారు తుది శ్వాస విడిచారు. ఆయన మరణించిన తరువాత ఆయన గురించిన ఎన్నో గొప్ప విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. రాజుల వంశంలో పుట్టడం కాదు కృష్ణం రాజు గారు నిజంగా రాజే అన్నట్లు గా తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలను వల్ల కృష్ణం రాజు గారు మరణించారు. అయన కరోనా సోకిన తరువాత కిడ్నీ పనితీరు చెడిపోయింది. ఇక కరోనా నుండి కోలుకున్నాక కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఆయన చాలా కాలం నుండి ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇక నిన్న ఉదయం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

మొదటి భార్య సీతా దేవి కి ఇచ్చిన మాట…

అందరికీ తెలిసిన విషయమే కృష్ణం రాజుగారి మొదటి భార్య సీతా దేవి గారు యాక్సిడెంట్ లో అనుకోని విధంగా మరణించడంతో అయన ఒంటరి వాడైపోయారు. ఇక ఆయన ఒంటరితనంతో అలా క్రుంగిపోవడం ఇష్టంలేక ఆయన కుటుంబం ఆయనకు శ్యామల దేవి గారిని ఇచ్చి మళ్ళీ రెండో వివాహం చేసారు. రాజవంశంలో పుట్టిన వారికి పట్టింపులు ఆచారాలు ఎక్కువ అయితే సీతా దేవి గారు అన్నం తినే సమయంలో మొదటి ముద్ద దేవుడికి పక్కన పెట్టేవారట. ఇక సీతా దేవి గారు కృష్ణం రాజు గారి జీవితంలోకి వచ్చాక ఆయనకు కూడా ఆ అలవాటు అబ్బింది.

ఇక సీతా దేవి గారు మరణించినా కృష్ణం రాజుగారు ఆ అలవాటును మానలేదట. అయన తుది శ్వాస వదిలే వరకూ ఆయన ప్రతి రోజు తినే ముందు మొదటి ముద్ద ఆయన భార్య సీతాదేవికి పెడతారట. ఇది ఆయన మరణించే వరకూ పాటించారు. ఆయన జీవంచి ఉన్నంత వరకు రెండో భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నా మొదటి భార్య జ్ఞాపకాలను బాగా నెమరువెసుకునేవారట.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago