Krishnam Raju -Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతూ ఎంపీగా బాధ్యతలను నిర్వహించారు నటుడు కృష్ణంరాజు. 1998 కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు తీసుకోవడమే కాకుండా అటల్ బీహారీ వాజ్ పాయ్ హయామంలో కేంద్ర మంత్రిగా కూడా కొనసాగారు. అయితే ఈయన సినీ కెరియర్ లోను రాజకీయ కెరియర్ లోను చిరంజీవితో ఎంతో సఖ్యతగా ఉండేవారు.
చిరంజీవి కృష్ణంరాజు ఇద్దరు మొగల్తూరుకు చెందిన వారే కావడంతో వీరి మధ్య ఎంతో మంచి అనుబంధ ఉంది. ఇలా కృష్ణంరాజు సినిమా ఇండస్ట్రీలో ఉండగా చిరంజీవి సైతం సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతూ అగ్ర హీరోగా పేరు సంపాదించుకున్నారు ఇకపోతే కృష్ణంరాజు 2009వ సంవత్సరంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
ఈ విధంగా ప్రజారాజ్యం పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించిన కృష్ణంరాజు రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇలా రాజకీయాలలో చిరంజీవికి మద్దతుగా నిలబడిన ఈయన అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత తిరిగి బిజెపిలో చేరారు. బిజెపిలో కొనసాగుతున్నప్పటికీ ఈయన మాత్రం రాజకీయాలలో చురుగ్గా కొనసాగలేదు.
ఇకపోతే ఒకసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో భాగంగా తన మేనల్లుడితో కలిసి వెళ్లిన కృష్ణంరాజు అక్కడ తన మేనల్లుడు లండన్ నుంచి తెచ్చిన ఒక కెమెరాతో అక్కడికి వచ్చిన సెలబ్రిటీల ఫోటోలను తీస్తున్నారు.అది చూసిన చిరంజీవి కెమెరా ఎక్కడ కొన్నారు అన్న దీనిని నేను లండన్ లో చూశాను చాలా కాస్ట్లీ కెమెరా అంటూ అని అడగడంతో వెంటనే కృష్ణంరాజు తన మేనల్లుడి మెడలో ఉన్నటువంటి కెమెరా తీసి చిరంజీవి మెడలో వేసి నీ బర్త్డే గిఫ్ట్ ఇదేనంటూ చెప్పారు. అలా ఆరోజు కృష్ణంరాజు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేని చిరంజీవి పలుసార్లు గుర్తు చేసుకున్నారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…