Krishnam Raju : కత్తందుకో జానకి అనే డైలాగ్ అనగానే కృష్ణం రాజుగారు గుర్తొస్తారు. కోపం, రౌద్రం ఇలా ఏదైనా నతనలో అన్ని రకాల హవాభావాలు పలికించి ఆకట్టుకున్న నటుడు కృష్ణం రాజు గారు. అయన నిన్న తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అయిన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించేవుంటారు. అలాంటి కృష్ణం రాజుగారికి జీవితంలో కొన్ని తీరని కోరికలు ఉండిపోయాయి. ఆ ఐదు కోరికలు ఎందకునో ఆయన ఎంత ప్రయత్నించినా జరగలేదు.
ఆ సినిమాలు… ప్రభాస్ పెళ్లి….

తమ్ముడి కొడుకే అయిన ప్రభాస్ అంటే సొంత కొడుకులాగే చూసుకున్నారు కృష్ణం రాజుగారు. ఆయన గత కొంతకాలంగా ప్రభాస్ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నించినా ఎందుకనో కుదరలేదు. ఇంటర్వ్యూ లలో కూడా త్వరలో అయిపోతుంది అంటూ చెప్పేవారు కానీ కుదరలేదు. ఇక ప్రభాస్ తో ఆయన కొన్ని సినిమాలు చేయాలని అనుకొన్నారు ఆది కూడా జరగలేదు. ఆయన స్వయంగా దర్శకత్వం వహించి ప్రభాస్ ను హీరోగా ఒక సినిమా తీయాలనీ భావించారు ఆది తీరాలేదు. ఇక ప్రభాస్ తో ఎన్ని సినిమాల్లో నటించిన కృష్ణం రాజుగారి ఆల్ టైం క్లాసిక్ సినిమా ‘భక్త కన్నప్ప’ సినిమా ప్రభాస్ తో చేయాలని అనుకున్నారు.

ఇక ఛత్రపతి సినిమాలోని ‘ఒక్క అడుగు’ డైలాగ్ ని సినిమా పేరుగా చేగువేరా కాన్సెప్ట్ తో సినిమా చేయాలని అనుకొన్నారు ఆది ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా మధ్యలో ఆగిపోయింది. ఇందులో ఐదుమంది యంగ్ హీరోస్ తో మెయిన్ లీడ్ గా ప్రభాస్ ని పెట్టి భారీ బడ్జెట్ సినిమా సొంత బ్యానర్ గోపిక్రిష్ణ నిర్మాణం లో చేయాలని అనుకున్న కుదరలేదు. ఇక ‘విశాల హృదయలు’ నవల ఆధారంగా సినిమా ప్రభాస్ తో చేయాలని భావించినా ఎందుకనో ఆది కూడా కుదరలేదు. ఇక చివరగా ఆయన రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేశారు బీజేపీ లో సెంట్రల్ మినిస్టర్ గా కూడా పనిచేసారు. అయితే ఈ సారి మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయనకు గవర్నర్ పదవి వస్తుందని భావించారు కానీ అది తీరకుండానే ఆయన మరణించారు.































