మొదటి సినమాతోనే ‘ఉప్పెన’ లా దూసుకువచ్చి.. కుర్రాకారు గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది.. కృతిశెట్టి. మాతృభాష కన్నడం అయినా తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మొదట ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా, మోడల్గా పలు యాడ్స్ తో ఓ మోస్తారు గుర్తింపు పొందింది. తర్వాత హీరోయిన్ అయిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది.
యాడ్స్ లో ఎంతోకొంత సంపాదించే ఈమె ఒక్కసారిగా లక్షల్లో సంపాదించడం మొదలు పెట్టింది. ఇదంతా ఇలా ఉండగా.. ఎవరికైనా తన అభినమాన హీరోయిన్, హీరోలకు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారనే ఆలోచన.. తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ప్రస్తుతం కృతిశెట్టి రెమ్యూనరేషన్ గురించి నెట్టింట్లో ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఉప్పెన సినిమా రిలీజ్ అయిన తరువాత కృతి డేట్లు దొరకడం కష్టమేనని చిరంజీవి ఆ సినిమా ఫంక్షన్లో అన్నారు.
అక్షరాలా ఇప్పుడు ఆయన అన్నట్టుగానే జరుగుతోంది. ఉప్పెన సినిమాకి రూ. 25 లక్షల లోపు పారితోషికం తీసుకున్న కృతి శెట్టి, ఆ తరువాత నాని .. సుధీర్ బాబు సినిమాలకి కూడా కాస్త అటు ఇటు గానే పారితోషికం తీసుకుందట. ఆ తరువాత చైతూతో చేస్తున్న బంగార్రాజు .. నితిన్ జోడీగా చేస్తున్న ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా కోసం ఆమె తన పారితోషికాన్నిరూ. 50 లక్షలకు తీసుకెళ్లిందట.
ఉప్పెన సినిమాను బాలీవుడ్ లో రిమేక్ చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే దీనికి మాత్రం ఆమెకు కోటి రూపాయల పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఇలా లక్షలతో మొదలైన ఆమె పారితోషికం.. కోటి వరకు వెళ్లింది.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…