దహన సంస్కారాలకు డబ్బులు లేక ఓ వ్యక్తి తన భార్య శవాన్ని దుప్పట్లో చుట్టి.. గుట్టుచప్పుడు కాకుండా చెరువులో పడేద్దామని నిర్ణయం తీసుకున్నాడు. అలా అతడి తన స్నేహితుడి సహకారం తీసుకొని తీసుకెళ్తుండా.. స్థానికులు పట్టుకున్నారు. ఈ సంఘటన శక్రవారం రాత్రి హైదరాబాద్ శివారు ప్రాతంలో ఉన్న హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది.
హయత్నగర్ పాత గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అతడు మేస్త్రీ పని చేస్తుండగా.. ఆమె కూలీ పనులు చేస్తూ ఉంటుంది. ఆమె ఇటీవల అనారోగ్యంతో ఇంట్లో ఉండగా.. తన భర్త పనికి వెళ్లి ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటకి ఆమె మృతి చెందింది.
అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేవని రాత్రి 11 గంటల సమయంలో అతని స్నేహితుడు వినోద్ సహాయంతో బార్య మృత దేహాన్ని భజంపై వేసుకుని సమీపంలో ఉప్ప బాతుల చెరువు అలుగు వద్ద పడేసేందుకు వెళ్తున్నాడు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
లక్ష్మీ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించగా శనివారం ఉదయం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. అందులో ఆమె అనారోగ్యంతోనే మరణించిందంటూ వెల్లడించారు. దీంతో పోలీసులు వారి కుటుంసభ్యులను పిలిపించి త్వరలోనే మృత దేహాన్ని అప్పగిస్తామంటూ పోలీసులు తెలిపారు. దీనిపై నిన్న విభన్న కథనాలు వినిపించాయి. కానీ పోలీసులు పోస్టు మార్టం రిపోర్టు రాగానే నిజాలను వెల్లడించనున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…