దహన సంస్కారాలకు డబ్బులు లేక ఓ వ్యక్తి తన భార్య శవాన్ని దుప్పట్లో చుట్టి.. గుట్టుచప్పుడు కాకుండా చెరువులో పడేద్దామని నిర్ణయం తీసుకున్నాడు. అలా అతడి తన స్నేహితుడి సహకారం తీసుకొని తీసుకెళ్తుండా.. స్థానికులు పట్టుకున్నారు. ఈ సంఘటన శక్రవారం రాత్రి హైదరాబాద్ శివారు ప్రాతంలో ఉన్న హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది.
హయత్నగర్ పాత గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అతడు మేస్త్రీ పని చేస్తుండగా.. ఆమె కూలీ పనులు చేస్తూ ఉంటుంది. ఆమె ఇటీవల అనారోగ్యంతో ఇంట్లో ఉండగా.. తన భర్త పనికి వెళ్లి ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటకి ఆమె మృతి చెందింది.
అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేవని రాత్రి 11 గంటల సమయంలో అతని స్నేహితుడు వినోద్ సహాయంతో బార్య మృత దేహాన్ని భజంపై వేసుకుని సమీపంలో ఉప్ప బాతుల చెరువు అలుగు వద్ద పడేసేందుకు వెళ్తున్నాడు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
లక్ష్మీ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించగా శనివారం ఉదయం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. అందులో ఆమె అనారోగ్యంతోనే మరణించిందంటూ వెల్లడించారు. దీంతో పోలీసులు వారి కుటుంసభ్యులను పిలిపించి త్వరలోనే మృత దేహాన్ని అప్పగిస్తామంటూ పోలీసులు తెలిపారు. దీనిపై నిన్న విభన్న కథనాలు వినిపించాయి. కానీ పోలీసులు పోస్టు మార్టం రిపోర్టు రాగానే నిజాలను వెల్లడించనున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…