టికెట్ అడిగినందుకు ఓ ప్రయాణికుడు మహిళా కండక్టర్ చొక్కా చింపేసి, ఆమెపై పిడిగుద్దులతో తీవ్రంగా దాడిచేసిన ఘటన చిత్తూరుజిల్లా, గుర్రంగకొండ, తరికొండల సమీపంలో చోటుచేసుకుంది. మదనపల్లెకు చెందిన బస్సు లో మహిళా కండక్టర్ తన విధులను నిర్వహిస్తున్నారు. అదేసమయంలో ఆర్టీసీ బస్సు ఎక్కినా శివారెడ్డి అనే వ్యక్తి ఎక్కాడు. ప్రయాణికులందరికి టికెట్లు ఇచ్చింది కండక్టర్.. అయితే శివారెడ్డి అనే వ్యక్తి మాత్రం టికెట్ తీసుకోలేదు.. టికెట్ తీసుకోకపోవడంతో అతనికి ప్రశ్నించింది మహిళా కండక్టర్. టికెట్ తీసుకోమని అడిగినందుకు కోపంతో ఊగిపోయాడు శివారెడ్డి, కాస్తసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆతరువాత ఆమెపై దాడి చేయడం మొదలుపెట్టాడు శివారెడ్డి.

మహిళ అని కూడా చూడకుండా.. ఆమె చొక్కా చింపేసాడు.. ఆమెపై పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా దాడి చేసాడు. చివరికి మిగిలిన ప్రయాణికులంతా కలిసి శివారెడ్డిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. వాల్మీకిపురం పోలీస్టేషన్ లో ఆమె పిర్యాదు చేసారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు గాయాలు కావడంతో దగ్గర్లోని హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నారు. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి..





























