టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ఇక ఈయన సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండగా ఇందులో పవన్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. అంతే కాకుండా ఇందులో రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రానా విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

ఇక ఈ సినిమా గురించి ఏదో ఒక అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కోసం పవన్ బాగా కష్టపడుతున్నాడట. ఇక రానా పాత్ర పవన్ పాత్రతో సమానంగా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా మొత్తం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కనుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన ప్రాజెక్టు పూర్తయింది. రెండో షెడ్యూల్ ప్రారంభించడానికి ప్లాన్ చేయగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా వాయిదా పడింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్ ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తున్నారు. జూలై మొదటి వారంలో ఈ సినిమా సెట్ లోకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ నిర్మిస్తున్నారట.
ఇందులో పవన్, రానా ఒకరినొకరు తలపడే సన్నివేశాలు ఎదురవడంతో పాటు.. ఇది సినిమాకు హైలెట్ గా మారుతుందని సమాచారం. ఇక మొత్తానికి ఈ సినిమా గురించి పవన్ అభిమానులు ఎదురు చూడగా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మొదటి రోజు నుండే సెట్ లోకి అడుగు పెట్టానున్నాడట. అంతే కాకుండా పవన్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా బిజీగా ఉన్నాడు. ఇక రానా కూడా విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.





























