తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలను, ప్రేమకథా చిత్రాలను, యాక్షన్ సినిమాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో ఈవీవీ సత్యనారాయణ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈవీవీ గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందారు.ఈవీవీ ఇండస్ట్రీలో బ్రతికినన్ని రోజుల్లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆయన మరణించినప్పటికీ అతను దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాయి. ఇంతగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గురించి పలు ఆసక్తికరమైన, చాలామందికి తెలియని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
ఈవీవీ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం, దొమ్మేరు. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈవీవీ కి చదువుతున్న రోజుల్లోనే సినిమాలపై ఎంతో పిచ్చి ఉండేది. ఈ క్రమంలోనే నిర్మాతగా అప్పట్లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నవతా కృష్ణంరాజు తెలిసిన వ్యక్తి తన ఊరిలో ఉండటంవల్ల ఆయనతో రికమెండేషన్ లెటర్ పెట్టించుకుని మద్రాస్ బయలుదేరారు. ఈ విధంగా నిర్మాత నవతా కృష్ణంరాజును కలిసిన ఈవీవీకి అతని దగ్గరి నుంచి చేదు అనుభవం ఎదురైంది.
కృష్ణంరాజును కలిసిన ఈవీవీకి ఈ సినిమా గోల ఎందుకు? ఇక్కడ ఏ కొందరికో అవకాశం వస్తుంది అంటూ చాలా నిరుత్సాహ పరిచారు. అయినప్పటికీ సినిమాలపై ఉన్న మక్కువతో నిర్మాత కృష్ణంరాజు దర్శకుడు దేవదాస్ కనకాల దగ్గర ఈవీవీను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఓనమాలను ఈవీవీ దర్శకుడు దేవదాస్ కనకాల నుంచి నేర్చుకున్నారు. ఇలా దేవదాస్ కనకాల దగ్గర నాలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత ఈవీవీను జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగుస్తంభాలాట చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా నియమించారు.
అయితే జంధ్యాల దగ్గరకు రాకముందు అతని దృష్టి మొత్తం దర్శకత్వం పైనే ఉండేది. ఆ తర్వాత కథలు రాయడానికి ఇష్టం రావడంతో ఎన్నో కథలను రాసి పత్రికలకు పంపేవారు. అయితే ఆ కథలలో ఎక్కువగా ప్రచురితం కాక వెనక్కి తిరిగి వచ్చేవి. అలా వెనక్కి తిరిగి వచ్చిన కథలలో ‘ఆడే మగైతే’ అనే కథ ఒకటి. ఈ కథను “మొగుడు – పెళ్లాలు” సినిమా షూటింగ్ సమయంలో జంధ్యాలకు చెప్పినప్పుడు ఈ కథ చాలా బాగుంది చేద్దామని చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగ్ కి నోచుకోలేక పోయింది.
ఇలా అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన సత్యనారాయణ మొట్టమొదటిసారిగా రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన “చెవిలో పువ్వు” అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వకపోయినా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ప్రేమఖైదీ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే జంబలకడిపంబ, సీతారత్నం గారి అబ్బాయి, అప్పుల అప్పారావు, హలో బ్రదర్, ఆమె, ఆయనకిద్దరు, వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈవివి సత్యనారాయణ గొంతు క్యాన్సర్ ద్వారా మృత్యువాత పడ్డారు. ఈయన వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ తన తండ్రి ఉన్నప్పుడు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన వీరికి తన తండ్రి మరణం తర్వాత సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పవచ్చు.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…