Connect with us

Featured

ఈవీవీ సత్యనారాయణ గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!

Published

on

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలను, ప్రేమకథా చిత్రాలను, యాక్షన్ సినిమాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో ఈవీవీ సత్యనారాయణ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈవీవీ గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందారు.ఈవీవీ ఇండస్ట్రీలో బ్రతికినన్ని రోజుల్లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆయన మరణించినప్పటికీ అతను దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాయి. ఇంతగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గురించి పలు ఆసక్తికరమైన, చాలామందికి తెలియని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

ఈవీవీ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం, దొమ్మేరు. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈవీవీ కి చదువుతున్న రోజుల్లోనే సినిమాలపై ఎంతో పిచ్చి ఉండేది. ఈ క్రమంలోనే నిర్మాతగా అప్పట్లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నవతా కృష్ణంరాజు తెలిసిన వ్యక్తి తన ఊరిలో ఉండటంవల్ల ఆయనతో రికమెండేషన్ లెటర్ పెట్టించుకుని మద్రాస్ బయలుదేరారు. ఈ విధంగా నిర్మాత నవతా కృష్ణంరాజును కలిసిన ఈవీవీకి అతని దగ్గరి నుంచి చేదు అనుభవం ఎదురైంది.

కృష్ణంరాజును కలిసిన ఈవీవీకి ఈ సినిమా గోల ఎందుకు? ఇక్కడ ఏ కొందరికో అవకాశం వస్తుంది అంటూ చాలా నిరుత్సాహ పరిచారు. అయినప్పటికీ సినిమాలపై ఉన్న మక్కువతో నిర్మాత కృష్ణంరాజు దర్శకుడు దేవదాస్ కనకాల దగ్గర ఈవీవీను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఓనమాలను ఈవీవీ దర్శకుడు దేవదాస్ కనకాల నుంచి నేర్చుకున్నారు. ఇలా దేవదాస్ కనకాల దగ్గర నాలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత ఈవీవీను జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగుస్తంభాలాట చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా నియమించారు.

అయితే జంధ్యాల దగ్గరకు రాకముందు అతని దృష్టి మొత్తం దర్శకత్వం పైనే ఉండేది. ఆ తర్వాత కథలు రాయడానికి ఇష్టం రావడంతో ఎన్నో కథలను రాసి పత్రికలకు పంపేవారు. అయితే ఆ కథలలో ఎక్కువగా ప్రచురితం కాక వెనక్కి తిరిగి వచ్చేవి. అలా వెనక్కి తిరిగి వచ్చిన కథలలో  ‘ఆడే మగైతే’ అనే కథ ఒకటి. ఈ కథను “మొగుడు – పెళ్లాలు” సినిమా షూటింగ్ సమయంలో జంధ్యాలకు చెప్పినప్పుడు ఈ కథ చాలా బాగుంది చేద్దామని చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగ్ కి నోచుకోలేక పోయింది.

ఇలా అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన సత్యనారాయణ మొట్టమొదటిసారిగా రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన “చెవిలో పువ్వు” అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వకపోయినా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ప్రేమఖైదీ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే జంబలకడిపంబ, సీతారత్నం గారి అబ్బాయి, అప్పుల అప్పారావు, హలో బ్రదర్, ఆమె, ఆయనకిద్దరు, వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈవివి సత్యనారాయణ గొంతు క్యాన్సర్ ద్వారా మృత్యువాత పడ్డారు. ఈయన వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ తన తండ్రి ఉన్నప్పుడు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన వీరికి తన తండ్రి మరణం తర్వాత సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పవచ్చు.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!