Featured

రోడ్లపైకి కొట్టుకు వచ్చిన చేపలు… ఎగబడిన జనం.. వీడియో వైరల్!

గత రెండు రోజుల నుంచి తెలంగాణలో పలు జిల్లాలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు నగరాలు జల సందిగ్ధంలో మునిగిపోయాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వాగులు వంకలు పొంగడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా మొత్తం వరద నీరు వచ్చి చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

ఈ విధంగా అధిక వర్షాలు కురవడంతో రోడ్లపైకి నీళ్లు రావడం వల్ల చెరువులో ఉన్నటువంటి చేపలని రోడ్డుపైకి కొట్టుకు వచ్చాయి.ఈ విధంగా రోడ్డుపైకి చేపలు రావడంతో వాటిని చూసిన జనాలు చేపలు పట్టు కోవడం కోసం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. దొరికిన వారికి దొరికినన్ని చేపలను పట్టుకుని ఇంటికి వెళ్తున్నారు.

ఈ విధంగా వరద నీటిలో కొట్టుకు వచ్చిన చేపలు 1కిలో రెండు కిలోల వరకు బరువు ఉన్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే గత మూడు రోజుల నుంచి దంచికొడుతున్న వర్షాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా ప్రజలకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మరో రెండు రోజులపాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఎలాంటి పరిస్థితులలో బయటకు రాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెన వాగు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో ఈ నీటి ప్రవాహానికి ఆటోనగర్‌ను వరద నీరు చేరడంతో సుమారు 40 మంది వరకు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పిల్లలకు బెస్ట్ హెల్తీ స్వీట్ ఐడియా ఇదే.. పాలు, బెల్లంతో సూపర్ టేస్ట్.. సింపుల్ హోమ్ రెసిపీ!

ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…

1 hour ago

నిద్రలో లేచి తింటున్నారా? సాధారణమా లేక ఆరోగ్య సమస్యా?

అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…

2 hours ago

వేసవిలో శరీరానికి కూలింగ్ కావాలా?దాహం, అలసటకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇదే!

వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…

2 hours ago

ఖాళీ కడుపుతో వాకింగ్.. నిజంగా మంచిదేనా?

దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…

2 hours ago

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago