దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో దేశంలోని పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ విధంగా కేసులు పెరగడానికి ప్రధాన కారణం ప్రజల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. ప్రజలందరూ పూర్తిగా కరోనా జాగ్రత్తలను పాటించడం లేదు. ఈ క్రమంలోనే ఢిల్లీలో రోజురోజుకు కేసులు పెరగడంతో వారంతపు లాక్ డౌన్ కూడా విధించారు.
ఈ నేపథ్యంలోనే కరోనా నిబంధనలను ఉల్లంఘించి ఓ జంట కారులో షికారు కొట్టారు. ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ఫ్యూ పాస్ లేకుండా నిబంధనలు ఉల్లంఘించి కారులో వెళుతున్న జంటను పోలీసులు మాస్క్ పెట్టుకోలేదని ప్రశ్నించారు. దీంతో సదరు వ్యక్తి “నా కారు ఎందుకు ఆపారు”?నా కారులో నా భార్యతో లోపల ఉన్నాను అంటూ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే అతని భార్య పోలీసులపై ఎదురు దాడికి దిగుతూ ఇప్పుడు నా భర్తకు ముద్దిస్తా నన్ను ఆపుతావా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంతలోనే అక్కడకు ఒక మహిళా కానిస్టేబుల్ చేరుకొని ఆమెను సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ వ్యక్తి పంకజ్ దత్త అని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.త్వరలోనే అతని భార్య పై కూడా చర్యలు తీసుకోనున్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…