Madhavan : టీవీ సీరియల్స్, చిన్న చిన్న పాత్రల ద్వారా తన కెరీర్ ని ప్రారంభించిన మాధవన్ 2000 సంవత్సరంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అలై పాయుదే’ సినిమా తన కెరీర్లో పెద్ద మలుపు అని చెప్పుకోవచ్చు. కెరీర్ మొదట్లోనే రొమాంటిక్ హీరోగా పేరుతెచ్చుకున్న మాధవన్, 2002 లో లింగస్వామి దర్శకత్వంలో ‘రన్’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నారు. అప్పట్లో తెలుగులో కూడా అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలిగాడు. దాదాపుగా 7 భాషల సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో మాధవన్ కూడా ఒకరు.

తాజాగా మాధవన్ నటించి, తానే స్వయంగా తెరకెక్కించిన ‘రాకెట్రీ’ మూవీ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు మాధవన్. ఆక్రమంలోనే హీరో సూర్య తో వీడియో చిట్ చాట్ లో పాల్గొన్నాడు. చాలా సేపు మాట్లాడుకున్న వీరిద్దరూ ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.
మిమ్మల్ని చూసాకే నన్ను నేను ప్రశ్నించ్చుకోవడం మొదలు పెట్టాను…

వీడియో చిట్ చాట్ లో మాట్లాడేటప్పుడు మాధవన్ గజినీ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. గజిని మూవీ ఆఫర్ మొదటగా మురుగదాస్ సర్ తనకే చెప్పాడని, అయితే సెకండ్ ఆఫ్ లో కథ నచ్చక నో చెప్పానని చెప్పాడు. ఆ సినిమా చివరికి నీ దగ్గరికి వచ్చింది. అంతకుముందు మిమ్మల్ని నేను ‘కాఖా కాఖా’ సినిమాలో చూశాను. తరువాత గజినిలో మిమ్మల్ని చూశాక ఆ సినిమా సరైన వ్యక్తి దగ్గరికి వెళ్లిందని అనిపించింది. ఆ విషయాన్ని మీరు కూడా నిరూపించారు, అని సూర్య తో చెప్పారు.

గజినీ సినిమాలోని సిక్స్ ప్యాక్ వెనుక మీరు పడ్డ కష్టాన్ని నేను చూసాను. ఒక వారం పాటు ఉప్పు లేని ఆహారం తీసువడం చూసి నేను ఇలా చేయగలనా అని ఆశ్చర్యం వేసింది. మీరు కష్టపడ్డ తీరు నాలో ఆసక్తిని పెంచింది. అప్పటినుండే నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. అప్పటినుండే మీదగ్గర సలహాలు తీసుకోవడం కూడా ప్రారంభించాను. ఇండస్ట్రీలో నాకు పెద్ద స్నేహితులు ఎవరూలేరు, మిమ్మల్ని జ్యోతికను కలిసిన తర్వాత స్నేహం గురించి తెలుసుకున్నాను. ఈ వయసులో స్నేహం పొందడం చాలా కష్టం, కానీ నాకెప్పుడూ ఏ అవసరం వచ్చినా అపుడు మీరుంటారు… అంటూ సూర్యతో భావోద్వేగానికి లోనయ్యారు.

































