Maha Shivaratri: నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు చేస్తూ శివరాత్రి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఇలా శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఒక్క శివాలయాలలో శివనామస్మరణతో భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక శివరాత్రి అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఉపవాసం జాగరణ.ఇలా శివరాత్రి రోజు ఉపవాసం ఎప్పుడు ఏ సమయం నుంచి మొదలుపెట్టి ఏ సమయం వరకు ఉండాలి ఈ ఉపవాస సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.
ఈ క్రమంలోని శివరాత్రి రోజు ఉపవాసం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం… శివరాత్రి నేడు అనగా ఫిబ్రవరి 18వ తేదీ వచ్చింది కనుక ఫిబ్రవరి 18వ తేదీ శనివారం తెల్లవారుజామున నుంచి ఫిబ్రవరి 19 మరుసటి రోజు సూర్యోదయం అయ్యేవరకు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. ఇలా ఉపవాసంలో ఉండి ఇతరులను దుర్భాషలాడకూడదు. ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేయకూడదు. కేవలం ప్రశాంతమైన మనసుతో శివయ్యను కొలుస్తూ శివుడిని పూజిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి.
ఇలా ఉపవాసంతో పాటు శివరాత్రి రోజున శివుడిని నాలుగు దశలలో పూజించాలి. ఇలా ఈ నాలుగు దశలలో పూజించినప్పుడు తప్పనిసరిగా పరమేశ్వరుడి అనుగ్రహం మనకు కలుగుతుందని చెప్పాలి మరి నాలుగు దశలలో అంటే ఏ సమయంలో పరమేశ్వరుడిని పూజించాలి అనే విషయానికి వస్తే..మెుదటి ప్రహర పూజ సమయం ఉదయం 06:40 ప్రారంభించి 9:47 వరకు చెయ్యాలని. ఇక రెండవ ప్రహర పూజా సమయం 9:47 నుంచి 12:53 వరకు చేయాలి.
ఇక మూడవ ప్రహర పూజ సమయం 12:53 నుంచి 4:00 వరకు ఇక చివరిగా నాల్గవ ప్రహర పూజా సమయం 4:00 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించాలని పండితులు చెప్పుకొచ్చారు.ఈ పూజలన్నింటిలోనూ శివుడిని కొలుస్తూ శివనామస్మరణలతో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణ చేస్తూ శివయ్యను పూజిస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడే ఆ శివుడి అనుగ్రహం మనపై ఉంటుంది.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…