Maha Shivaratri: నేడు దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో శివరాత్రి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. శివరాత్రి రోజున పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉపవాస జాగరణలతో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక బోలా శంకరుడికి నేడు ప్రత్యేకమైన పూజలను చేస్తారు. ఇక శివరాత్రి రోజు శని త్రయోదశి రావటంతో ఈరోజు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు.
ఇలా శివరాత్రి రోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు చాలామంది కఠిన ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తూ శివయ్య నామస్మరణలతో లీనమై శివుడికి పూజలు చేస్తుంటారు.మరి ఉపవాసం ఉన్నవారు ఈరోజు ఎలాంటి పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
తీసుకోకూడని ఆహార పదార్థాలు..
శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవాళ్లు పొరపాటున కూడా మాంసాహార పదార్థాలను ముట్టుకోకూడదు. బియ్యం గోధుమలు పప్పులు వంటి తృణధాన్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అదేవిధంగా వెల్లుల్లి ఉల్లిపాయ వేసిన ఆహార పదార్థాలను తినకూడదు.
శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవాళ్లు పాలు పండ్లు వంటి ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. సగ్గుబియ్యం కిచిడి లేదా సగ్గుబియ్యం జావను తయారు చేసి అల్పాహారంగా తీసుకోవచ్చు. ఇక ఉపవాసం ఉన్నవాళ్లు ఎక్కువగా డిహైడ్రేషన్ కి గురవుతారు ఇలా డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండాలంటే పండ్ల రసాలను తీసుకోవడం మంచిది. ఇలా పండ్లు పాలు తీసుకుంటూ ఉపవాస జాగరణ చేయడం వల్ల శివయ్య అనుగ్రహం మనపై ఉంటుంది. ఇకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మందులను ఉపయోగించేవారు ఉపవాసం ఉండకపోవడం మంచిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…