Mahesh Babu : హీరోలు సినిమాలలో విరామం దొరికినపుడు విదేశాలకు వెళ్ళిపోవడం మామూలే. ఇక ఇలాంటి హీరోల్లో మహేష్ బాబు ముందుంటారు. తన ఫ్యామిలీతో టైం గడపడానికి మహేష్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చిన్నదో పెద్దదో తన కుటుంబంతో కలిసి ఏదోక ప్రదేశానికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ తరువాత కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటారు. అలా ఇప్పుడు కూడా మహేష్ అమెరికా వెళ్లారు. తన కుటుంబంతో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు.
ఆస్తులు కొంటున్న మహేష్…
అమెరికా ట్రిప్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే అసలు ట్రిప్ వెనుక రహస్యం వేరే ఉంది. కేవలం చూడ్డానికి మాత్రమే అమెరికా వెళ్ళలేదు, అక్కడ ఆస్తులు కొనుగోలు చేయాలని మహేష్ భావిస్తున్నారు. ఆయనకు సన్నిహితుడైన అనిల్ సుంకర సలహా మేరకు మహేష్ అమెరికాలో ఒక ప్రాపర్టీ ని కొన్నారు, దాని విలువ 50 కోట్లు ఉంటుందని అంచనా. అలా విదేశాల్లో ఆస్తులను కొంటున్నారు మహేష్. ఇక డార్లింగ్ ప్రభాస్ కూడా విదేశాల్లో ప్రాపర్టీస్ కొంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమా మంచి విజయం పొందింది. ఇక మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నారు. ఖలేజా సినిమా తరువాత చాలా రోజులకు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యాక మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. అసలే మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి మహేష్ కాంబో సినిమా కోసం బాగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టారు రాజమౌళి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…