Featured

Mahesh Babu: తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో స్మార్ట్ గా చెప్పేసిన మహేష్ బాబు…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించి, పరశురాం దర్శకత్వం వహించిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 14రీల్స్, జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. రెండేళ్ల తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అభిమానులు అంచనాలు బాగా ఉన్నాయి. మే 12 న ఈరోజు సినిమా విడుదల ఉండటంతో మహేష్ బాబు నిన్న తన ఇన్‌ స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా నవ్వుతూ సమాధానాలు చెప్పారు.

మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు…..

అభిమానులు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఆసక్తికర ప్రశ్నలు మహేష్ ని అడిగారు. మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు? అని ఒక ఫ్యాన్ మహేద ని అడిగగా… తన భార్య అయిన నమ్రత శిరోద్కర్ పేరు చెప్పారు. నమ్రతలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటని వేరొక అభిమాని ప్రశ్న అడుగగా… ఆమెలో అన్నీ ఇష్టమే, అందుకే పెళ్లి చేసుకున్నాను అని మహేష్ బాబు నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

అయితే సర్కారు వారి పాట సినిమాలో పెన్ని పాట లో సితార డాన్స్ చేసిన సంగతి తెలిసిందే ఇందుకు ఒక అభిమాని, సితార భవిష్యత్తులో వెండితెరమీద నటించే అవకాశం ఉందా అని అడగగా… అందుకు మహేష్, సితార ఇప్పటికే యాక్టర్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను అని సమాధానమిచ్చారు. వెంటనే ఇంకొక అభిమాని మీ ఇంట్లో స్మార్ట్ ఎవరు అని అడగగా.. తడుముకోకుండా వెంటనే మహేష్ బాబు సితార పేరు చెప్పేశారు. ఇంత బిజీ షెడ్యూల్లో పిల్లలతో సమయం ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించిన ఒక అభిమానికి… అది నేను చెప్పలేను కానీ పిల్లలతో మాత్రం తప్పకుండా సమయాన్ని గడపడానికె ఇష్టపడతాను అని సమాధానం చెప్పాడు.  ఈ విధంగా మహేష్ బాబు అభిమానుల తో చేసిన చిట్ చాట్ ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

7 minutes ago

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…

37 minutes ago

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

54 minutes ago

మునగాకు పొడి మాయలు.. ఈ సమస్యలకు సులభ పరిష్కారం!

ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…

1 hour ago

నిద్రలేవగానే బెడ్ సర్దేస్తున్నారా? ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…

1 hour ago

రుణబాధలు తగ్గాలా? వైశాఖ అమావాస్య రోజు తప్పక చేయాల్సినవి!

2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…

2 hours ago