Mahesh Babu: మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి చివరి కోరికను తీర్చలేకపోయారా…కుమిలిపోతున్న మహేష్ బాబు?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం జరిగిన విషయం మనకు తెలిసిందే. సెప్టెంబర్ 28వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇందిరా దేవి తుది శ్వాస విడిచారు. ఇలా ఇందిరా దేవి మరణించడంతో మహేష్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇకపోతే తల్లి పట్ల ఎంతో ప్రేమను చూపించే మహేష్ బాబు తన తల్లి చివరి కోరికను నెరవేర్చలేకపోయారని, ప్రస్తుతం ఈ విషయాన్ని గుర్తుచేసుకొని మహేష్ బాబు ఎంతగానో కుమిలి పోతున్నారని తెలుస్తోంది.

ఇంతకీ ఇందిరా దేవి చివరి కోరిక ఏంటి మహేష్ బాబు తీర్చలేని ఆ కోరిక ఏంటి అనే విషయానికి వస్తే..మహేష్ బాబు ఇందిరాదేవి ఆయన కుమార్తె సితార ఇద్దరు ఒకే పోలికలతో ఉండటం వల్ల సితార అన్న కూడా మహేష్ బాబుకు అమితమైన ప్రేమ అలాగే సితార తన నానమ్మ ఇందిరా దేవితో ఎంతో సమయం గడుపుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇందిరాదేవి తన మనవరాలు సితారకు ఓణీ ఫంక్షన్ చేయమని కోరారట.

అయితే మహేష్ బాబుకు ఇలాంటివన్నీ ఇష్టం లేకపోవడంతో ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందుకు అంటూ ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది.అయితే ఇందిరా దేవి తరచూ తన కోరిక గురించి మహేష్ బాబు దగ్గర ప్రస్తావించడంతో ఇప్పుడు అప్పుడు అంటూ మహేష్ బాబు ఆలస్యం చేస్తూ వచ్చారు. అయితే అదే సమయంలోనే ఇందిరా దేవి అనారోగ్యానికి గురయ్యారు.

Mahesh Babu: కొడుకుగా బాధ్యతలు నిర్వర్తించిన మహేష్…

ఈ విధంగా ఈమె అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా మహేష్ బాబుకు తన తల్లి లేని బాధ ఒకవైపు వేధిస్తుండగా మరోవైపు తన తల్లి సితార గురించి అడిగిన కోరికను తీర్చలేకపోయానని మరింత బాధపడుతున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా మహేష్ బాబు తన తల్లి మరణం పట్ల ఎంతగానో కృంగిపోయారు ఇక కొడుకుగా మహేష్ బాబు దగ్గరుండి హిందూ సంప్రదాయాల ప్రకారం తన తల్లికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు.