కరోనా మహమ్మారి ఊసురు తీస్తోంది. సామాన్యులు నుంచి సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి పిట్టల రాలిపోతున్నారు.ఇండస్ట్రీలో చాలా ప్రముఖుల కరోనా కారణంగా తనువు చాలించారు. తాజాగా ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి (33) కరోనాతో ఆరొగ్య పరిస్థితి విషమించి మరణించారు. అలాగే ఆమె పదేళ్లుగా క్యాన్సర్తో మహమ్మారితో కూడా పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆమెకు కరోనా కూడా సోకడంతో… తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తాజాగా కరోనా నుండి కోలుకుంటున్న ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడకపోవడంతో శరణ్య శశి(35) ఆగస్ట్ 9న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్యాస విడిచారు.

శరణ్య మంత్రకోడి, సీత, హరిచందనం లాంటి పలు మలయాళ టీవీ సిరియల్స్ నటించి పాపులారీటిని సంపాదించింది. అలాగే పలు సినిమాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది.ఆమె మృతికి పలవురు సీనీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.