Mamatha Mohan Das : ‘రాఖీ రాఖీ’ పాటతో సింగర్ గా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న మళయాళి భామ మమత మోహన్ దాస్. తెలుగులో యామదొంగ, కింగ్, కేడి, చింతకాయల రవి వంటి సినిమాల్లో మెరిసిన ఈ భామ మలయాళంలో ఎక్కువ సినిమాలను చేసి అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అనుకోకుండా అనారోగ్యం బారిన పడి సినిమాలకు దూరమై మళ్ళీ తిరిగి కోలుకున్నాక సినిమాల్లో నటిస్తూ బిజీ అయిన మమతా మోహన్ దాస్ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోను తెగ పొగిడేస్తోంది. ఆ హీరో మాత్రమే రియల్ హీరో అంటూ ప్రశంసిస్తోంది.

ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్న మమతా…
అనారోగ్యం నుండి కోలుకుని మళ్ళీ సినిమాల్లో నటిస్తున్న మమత ను గుర్తుపెట్టుకుని ఎన్టీఆర్ ఫోన్ చేసి మరీ బాగోగులు అడిగాడట. చేసింది ఒక్క సినిమానే అయినా తాను నన్ను గుర్తు పెట్టుకుని ఫోన్ చేసి నా బాగోగులు అడిగారు, నాతో కలిసి పనిచేసిన ఏ హీరో నా ఆరోగ్యం ఎలా ఉందంటూ పలకరించలేదు. నేను చాలా మంది హీరోలతో చేశాను, కానీ ఎవరూ నన్ను అలా గుర్తు పెట్టుకొని మాట్లాడించలేదని చెప్తూ ఎమోషనల్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ రియల్ హీరో అంటూ ప్రశంసిస్తోంది, తెలుగు ఇండస్ట్రీలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడంటూ ఆల్రడీ చిన్న ఎన్టీఆర్ కు మంచి పేరుంది, కోటా వంటి సీనియర్ నటులు సైతం ఈ తరం లో సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ లాంటోడు ఉండాలి అంటూ ఓపెన్ కామెంట్స్ చేసారు. ఇక మమత మాటలతో అది మరోసారి రుజువయింది. దీంతో నందమూరి అభిమానులు మా ఎన్టీఆర్ రియల్ హీరో, టాలీవుడ్ లో ఒక్క మగాడు అంటూ తెగ సంబరపడిపోతున్నారు.



























