Viral: ఈ మధ్య కాలంలో కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్స్ విచ్చలవిడిగా గూగుల్లో, సోషల్ మీడియాలో సంచరిస్తున్నాయి. అది నమ్మిన నెటిజన్లు గుడ్డిగా అక్కడికి వెళ్ళి పోతూ ఉంటారు. కానీ చివరికి అక్కడ ఏమీ ఉండదు. అదే తరుణంలో ఓ వ్యక్తి ఓయో హోటల్ CEO ని ఓ రేంజ్ లో కదిపించాడు.

మొత్తం 9 మంది ఉన్నారు. దాదాపు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణించి చివరికి పుదుచ్చేరికి చేరుకున్నారు. హోటల్ ఎక్కడ ఉందని అని ఓయో మెన్షన్ చేసిందో అక్కడికి వచ్చి చూశారు. కానీ అక్కడ ఎలాంటి హోటల్ లేదు. ఆ 9మందిలో ఒక్కడైనా అభిషంత్ పంత్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని లింక్డ్ఇన్ లో పంచుకున్నాడు.

ఓయో నుంచి తాము చేసుకున్న హోటల్ ప్రదేశాన్ని డిసెంబర్ 24న వచ్చి చూస్తే అక్కడ హోటల్ లేదని చెత్త,తుప్పలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వాళ్ళలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. రాత్రి సమయం వాళ్ళు రోడ్డుపై ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు.
ఇక్కడ హోటల్ లేనప్పుడు.. మరి ఆ హోటల్ రివ్యూస్ ఓపెన్ చేస్తే రివ్యూస్ లో ఏముందని అభిషంత్ చెక్ చేశాడు. సోషల్ నుంచి చాలామంది ఈ విషయంపై రివ్యూల ద్వారా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఎవరు స్పందించడం లేదని అభిషంత్ తెలిపాడు. అక్కడ హోటల్ లేదు సో.. అభిషంత్ ఓయో కస్టమర్ సర్వీస్ తో మాట్లాడాడు.
ఆ యాప్ తో ఎలాంటి ప్రయోజనం లేదు..
కస్టమర్, తమకు అక్కడ ఏ హోటల్ తో డీలింగ్స్ లేవని తెలిపారట. నిజానికి పుదుచ్చేరిలో 50 హోటల్స్ పైగా అందుబాటులో ఉన్నట్టు ఓయో యాప్ చెబుతుంది. వాళ్లు దాని విషయంలో ఎలాంటి హెల్ప్ పొందలేదని ఆయన ఇలా తెలిపాడు. “కస్టమర్ సర్వీస్ ఏజెంట్ దీని గురించి నాతో మాట్లాడుతూ..’మీకు ఏదైనా సమస్య ఉంటే.. మేక్మైట్రిప్ వాళ్లతో మాట్లాడుకోండి. మేము చేసేది ఏమీ లేదని అన్నాడు. దీనికి సంబంధించిన క్వాలిటీ చెక్ సిబ్బందికి మెయిల్ సెండ్ చేసినా వాళ్లు ఇప్పుడు ఈ పరిష్కారం చూపేందుకు ఆసక్తికరంగా లేరు” అని అభిషంత్ లింక్డ్ఇన్ వేదికగా పంచుకున్నాడు.ఇక బృందం ఏం చేయాలో తెలియక మరో హోటల్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. వీకెండ్ కావడంతో చివరి నిమిషములో బుక్ చేయడంతో డబుల్ పేమెంట్ అయిందని తెలిపారు.



























