Manchu Manoj: మంచు మనోజ్ మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు అయితే ఇటీవల కాలంలో ఈయన భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ దంపతులకు ఇటీవల కుమార్తె కూడా జన్మించారు. అయితే తన కుమార్తెకు ఎం ఎం పులి అనే నిక్ నేమ్ పెట్టినట్లు మనోజ్ తెలిపారు.
ఇకపోతే తాజాగా తన కుమార్తె బారసాల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా తన కుమార్తె పేరును కూడా ఈ సందర్భంగా మనోజ్ రివీల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనోజ్ తన కుమార్తెకు దేవసేన శోభ ఎం ఎం అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ కూడా చేశారు శివయ్య భక్తులమైన మేము ఆయన కుటుంబంలో భాగమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య దేవసేన పేరును తన కుమార్తెకు పెట్టడం జరిగింది అలాగే తన అత్తయ్య దివంగత శోభా నాగిరెడ్డి గారి పేరులో శోభా పేరును తన కుమార్తెకు పెట్టామని తమ అత్తయ్య ఆశీస్సులు తన బిడ్డపై ఉండాలని ఈయన కోరారు.
దేవసేన శోభ ఎం ఎం…
ఇలా తన కుమార్తెకు దేవసేన శోభ ఎం ఎం అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఇక తన జీవితంలో ఎంతో అండగా నిలిచిన తన తల్లిదండ్రులకు అలాగే భూమా కుటుంబ సభ్యులతో పాటు తన అక్క మంచు లక్ష్మి అలాగే అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనోజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…