Manchu Manoj -Mounika: అనాధల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మనోజ్ మౌనిక దంపతులు.. గ్రేట్ అంటూ?

Manchu Manoj -Mounika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఈయన సినిమాల పరంగాను తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.మనోజ్ భూమ మౌనిక వివాహం చేసుకున్న తర్వాత తన జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే తిరిగి సినిమా పనులలో కూడా ఈయన బిజీ అయ్యారు.ఇకపోతే మౌనిక మనోజ్ దంపతులు అనాధ పిల్లల కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు హీరోలు పేదవారి కోసం అనాధ పిల్లల కోసం పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మనోజ్ మౌనిక దంపతులు కూడా 2500 టికెట్లను కొనుగోలు చేశారు. ఇక ఈ విషయాన్ని మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఎలాంటి హద్దులు లేకుండా అందరూ ఒక వేడుకల జరుపుకోవాల్సిన సినిమా ఆది పురుష్. దీనిని మా జీవితంలో వచ్చిన ఒక గొప్ప అవకాశం గా భావిస్తున్నామంటూ తెలియజేశారు.

Manchu Manoj -Mounika: జైశ్రీరామ్ అన్న శ్లోకం వినిపించాలి…


ఈ క్రమంలోని ఇలాంటి ఒక గొప్ప సినిమాని రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ఆశ్రమాలలో ఉన్న అనాధ పిల్లలకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేయబోతున్నాం జైశ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్నిచోట్ల వినిపించాలి అంటూ ఈ సందర్భంగా మనోజ్ మౌనిక దంపతులు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.