Manchu Manoj: మంచు మనోజ్ పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి మనోజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మనోజ్ ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.
త్వరలోనే ఆంధ్రలో ఎన్నికలు జరగబోతున్నాయని అయితే మీరు ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఓటు వేయాలని ఎలా చెప్పారు ఎవరైతే మనతో పాటు మనకు తోడుగా నడుస్తారు. వారికే ఓటు వేయాలని తెలిపారు. దారుణాలకు పాల్పడేవారికి సొంత సభ్యులకే న్యాయం చేయలేకపోయే వారికి మాత్రం ఓటు వేయకండి అంటూ ఈయన చెప్పుకువచ్చారు.
మనోజ్ ఇలా ఎన్నికల గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈయన వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఓటు వేయద్దు అంటూ ప్రచారం చేశారు అంటూ పలువురు పెద్ద ఎత్తున ఈయనపై ట్రోల్స్ చేశారు ఇలా తన గురించి ట్రోల్స్ వస్తున్నటువంటి తరుణంలో మనోజ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. నాన్న పుట్టినరోజు వేడుకలలో భాగంగా నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి గురిచేశాయి అందుకే క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాను అని తెలిపారు.
ఏ పార్టీతో నాకు సంబంధం లేదు..
ప్రతీది రాజకీయంగా చూడకుండా ఐక్యత, గౌరవంగా ముందుకు సాగాలనేది నా మాటల ఉద్దేశం. ఏదో ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఏ పార్టీతో నాకు సంబంధాలు లేవు. గొడవలు కూడా లేవు. నటుడిగా నన్ను నా కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ఈయన ఇష్యూ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…