Manchu Vishnu: చిరంజీవి, జగన్ మీటింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మా అధ్యక్షుడు విష్ణు… అది పర్సనల్ మీటింగ్ అంటూ కామెంట్స్!
Manchu Vishnu: టాలీవుడ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా సినిమాలతో దమ్ము రేపుతోంది. పుష్ప సినిమా విడుదలై భారీ సక్సెస్ సాధించింది. మరో ప్యాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఫిలిం లవర్స్ ఎదరుచూస్తున్నారు.
మన సినిమాలు దేశం మొత్తం మారుమోగుతుంటే.. తెలుగు రాష్ట్రం ఏపీలో మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఏపీలో ధియేటర్ల టికెట్ ధరలను నిర్ణయించింది. దీంతో పాటు ఆన్ లైన్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఇదిలా ఉంటే ఈ వివాదంపై గతంలో ఇటు ప్రభుత్వం, అటు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య విమర్శ, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరో చేసిన థియేటర్ల కలెక్షన్లు, కిరణా దుకాణం కలెక్షన్ల కన్నా తక్కువగా ఉన్నాయనే వ్యాఖ్యలు పెద్ద దుమారానే రేపాయి. ఇదిలా ఉంటే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి… ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
ఈ సమయంలో ఇండస్ట్రీ సమస్యలను సీఎంకు వివరించారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలు తొలిగిపోతాయని.. సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. ఉద్రిక్తతలు పెంచేలా ఎవరూ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని సూచించారు. అక్కడితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉంటే ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవిల భేటీపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి. అది పర్సనల్ మీటింగ్ అని… దీనితో అసోసియేషన్ కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఏ ఒక్కరో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. టికెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిగారు సీఎం జగన్ ని కలవడాన్ని స్వాగతించారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…