తాజాగా జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఎగువ రేగడ గ్రామానికి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సాయి తేజ తెలుగు వారని తెలియడంతో సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా సాయి తేజ భార్య శ్యామలతో ఫోన్ లో మాట్లాడారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.
అలాగే వారి పిల్లలను ఇంజనీరింగ్ చదువు చెప్పించే బాధ్యత తనది అని తెలిపారు. జవాన్ సాయి తేజకు 5 ఏళ్ల కుమారుడు మోక్షజ్ఞ, రెండేళ్ల కుమార్తె దర్శిని ఉన్నారు. అయితే పిల్లల చదువు కోసం తన కుటుంబ స్వగ్రామం నుంచి మదనపల్లికి వెళ్లారు. చిత్తూరు జిల్లాలో మంచు విష్ణు కుటుంబానికి విద్యానికేతన్ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ విద్యా సంస్థల బాధ్యతలను విష్ణు చూసుకుంటుండటం వల్ల, సాయి తేజ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం సాయి తేజ భార్యతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని అందరూ అండగా ఉంటామని ఓదార్చారు.
అలాగే వారి పిల్లలను ఇంజనీరింగ్ చదువు చెప్పించే బాధ్యత తనది అని తెలిపారు. జవాన్ సాయి తేజకు 5 ఏళ్ల కుమారుడు మోక్షజ్ఞ, రెండేళ్ల కుమార్తె దర్శిని ఉన్నారు. అయితే పిల్లల చదువు కోసం తన కుటుంబ స్వగ్రామం నుంచి మదనపల్లికి వెళ్లారు. చిత్తూరు జిల్లాలో మంచు విష్ణు కుటుంబానికి విద్యానికేతన్ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ విద్యా సంస్థల బాధ్యతలను విష్ణు చూసుకుంటుండటం వల్ల, సాయి తేజ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం సాయి తేజ భార్యతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని అందరూ అండగా ఉంటామని ఓదార్చారు.
2013లో ఆర్మీలో చేరిన సాయి తేజ రక్షణ శాఖలో లాన్స్ నాయక్ గా పని చేస్తున్నారు. సాయి తేజ మరణంతో ఆయన కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. సాయి తేజ చివరిసారిగా వినాయకచవితి పండుగ సమయంలో ఇంటికి వచ్చారని, అలాగే తన భార్యతో చివరిసారిగా బుధవారం ఉదయం ఫోన్ లో మాట్లాడి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారని, అనంతరం సిగ్నల్ సరిగా లేకపోవడంతో కాల్ కట్ అయిందని, కాల్ మాట్లాడి కట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు అంటూ ఆయన సతీమణి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…